CM KCR : ఏడాదిన్నరలోగా బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులు పూర్తి : సీఎం కేసీఆర్

బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

CM KCR : ఏడాదిన్నరలోగా బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులు పూర్తి : సీఎం కేసీఆర్

Cm Kcr

CM KCR laid foundation stone : ఏడాదిన్నరలోగా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 4 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపన చేశామని తెలిపారు. 10 రోజుల్లో సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. సంగారెడ్డికి రూ.50కోట్లు, జహీరాబాద్ కు రూ.50 కోట్లు మంజూరు చేస్తూ రేపే జీవో జారీ చేస్తామని అన్నారు.
నారాయణ్ ఖేడ్ లో సీఎం కేసీఆర్ పర్యటించారు.

బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. నిధులు వృధా చేయకుండా ప్రజలకు ఏం కావాలో అవే చేయండి అని అన్నారు. పంచాయతీలకు ప్రతీ నెలా నిధులు పంపిస్తున్నామని తెలిపారు.

CM KCR : దేశంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్

సంగారెడ్డి జిల్లాలోని 699 పంచాయతీలకు రూ.20లక్షలు చొప్పున రూ.140 కోట్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో రాజకీయం ఉండాల్సినట్లుగా లేదన్నారు. ఏ రకమైన తెలంగాన ఉండాలో ప్రతీ ఒక్కరు చర్చ జరపాలని తెలిపారు. అన్ని కులాలు, వర్గాలు, మతాలు మంచిగా ఉండాలన్నారు. ఒక నారాయణ్ ఖేడ్ కే రూ.200 కోట్ల రైతుబంధు అందుతోందన్నారు.