CM KCR: రద్దయిన ఏరియల్ సర్వే.. రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్

ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటూరునాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఏటూరునాగారంలో ఆగాల్సి ఉన్నప్పటికీ నేరుగా భద్రాచలంకు వచ్చారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుండి సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు.

CM KCR: రద్దయిన ఏరియల్ సర్వే.. రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్

Kcr 02

CM KCR: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వేలాది మంది ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలో గోదావరి వరదల కారణంగా నీటమునిగిన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా ఆదివారం పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శనివారం సాయంత్రమే వరంగల్ జిల్లాకు చేరుకున్న కేసీఆర్ రాత్రి అక్కడే బస చేశారు. ఉదయం 8గంటలకు ఏరియల్ సర్వే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. వర్షం కురుస్తుండటంతో ఏరియల్ సర్వేకు వాతావరణం అనుకూలంగా లేకుండా పోయింది. దీంతో వరంగల్ నుంచి ఏటూరునాగారం మీదుగా సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకున్నారు.

Kcr

ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటూరునాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఏటూరునాగారంలో ఆగాల్సి ఉన్నప్పటికీ నేరుగా భద్రాచలంకు వచ్చారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుండి సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సీఎం కేసీఆర్ చేరుకొని వరద బాధితులను పరామర్శిస్తారు.

Kcr 01

ఇదిలాఉంటే సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా భద్రాచలంకు చేరుకోవాలని నిర్ణయించడంతో తొలుత భద్రతా సిబ్బంది వద్దని సూచించినట్లు సమాచారం. కానీ కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని స్పష్టం చేయడంతో పోలీసులు ఊరుకులు పరుగుల మీద భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించినట్లు తెలిసింది. తీవ్ర నక్సలైట్ ప్రభావిత ప్రాంతం ములుగు, ఏటూర్ నాగారం, మంగపేట, ఏడూళ్ల బయ్యారం, మణుగూర్, అశ్వాపురం, సారపాక మీదిగా సీఎం కేసీఆర్ కాన్వాయ్ భద్రాచలంకు చేరుకుంది. ఏటూరునాగారం నుంచి భద్రాచలం చేరుకొనే క్రమంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు వరద ముంపు తీవ్రతను సీఎం కేసీఆర్ కు వివరించారు. కేసీఆర్‌ వెంట సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. గోదావరి ఉధృతి కారణంగా భద్రాద్రి రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. పూర్తిగా అన్నదాన సత్రం నీటమునిగింది. కరకట్ట వద్ద మోటార్లు పనిచేయటం లేదు. మోటార్లు కాలిపోవటంతో రామాలయం వద్దకు లీకేజీ నీరు చేరింది.