COVID 19 : తెలంగాణలో కరోనా, 24 గంటల్లో 512 కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గతంలో వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.
COVID 19 In Telangana : తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గతంలో వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. మరణాల సంఖ్య కూడా తక్కువగా నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో గత 24 గంటల్లో 512 కేసులు నమోదయ్యాయని, ఒక్కరు మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం 4 వేల 108 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో 125 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 1, 217 మంది కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 7 లక్షల 73 వేల 362గా ఉంది.
Read More : AP Covid : ఏపీలో కరోనా.. ఊపిరిపీల్చుకుంటున్న జనాలు, కొత్తగా ఎన్ని కేసులంటే
జిల్లాల వారీగా కేసుల వివరాలు : – ఆదిలాబాద్ 13. భద్రాద్రి కొత్తగూడెం 11. జీహెచ్ఎంసీ 125. జగిత్యాల 12. జనగామ 16. జయశంకర్ భూపాలపల్లి 2. జోగులాంబ గద్వాల 2. కామారెడ్డి 3. కరీంనగర్ 17. ఖమ్మం 25. కొమరం భీం ఆసిఫాబాద్ 03. మహబూబ్ నగర్ 22. మహబూబాబాద్ 14. మంచిర్యాల 17. మెదక్ 03. మేడ్చల్ మల్కాజ్ గిరి 39. ములుగు 04. నాగర్ కర్నూలు 01. నల్గొండ 28. నారాయణపేట 03. నిర్మల్ 03. నిజామాబాద్ 17. పెద్దపల్లి 07. రాజన్న సిరిసిల్ల 10. రంగారెడ్డి 35. సంగారెడ్డి 14. సిద్దిపేట 14. సూర్యాపేట 09. వికారాబాద్ 07. వనపర్తి 06. వరంగల్ రూరల్ 05. వరంగల్ అర్బన్ 19. యాదాద్రి భువనగిరి 06. మొత్తం : 512
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.16.02.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/gXHXuNeolj— IPRDepartment (@IPRTelangana) February 16, 2022