Frog In patient Idli : ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి ఇడ్లీ పార్సిల్లో కప్ప కళేబరం..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి కోసం తెచ్చిన ఇడ్లీ పార్శిల్ లో చచ్చిపోయిన కప్ప సంచలనం కలిగించింది. తంజావూరు జిల్లా కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది.
Frog Found In patient Idli Parcel : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి కోసం తెచ్చిన ఇడ్లీ పార్శిల్ లో చచ్చిపోయిన కప్ప ఉండడం సంచలనం కలిగించింది. తంజావూరు జిల్లా కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. కుంభకోణం మాదాపురికి చెందిన మురుగేష్ గుండె చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్నాడు.
Read more : బాబోయ్.. కూల్ డ్రింక్ సీసాలో పాము పిల్ల.. జస్ట్లో బతికిపోయాడు..
అతని బంధువు శనివారం (నవంబర్ 28,2021) సమీపంలోని ఒక ఇటాలియన్ హోటల్ నుంచి ఓ ఇడ్లీ పార్సిల్ తీసుకువెళ్లాడు. ప్యాకెట్ విప్పి చూడగా ఇడ్లీ లోపల కప్ప కళేబరం కనిపించింది. దీంతో వారు షాక్ అయ్యారు. ఆ పార్శిల్ పట్టుకుని వెళ్లి..హోటల్ యజమానికి చూపించారు.
Read more : అయ్య బాబోయ్..ఉల్లి పకోడీలో కప్ప..!!
దీంతో హోటల్ లో ఉన్న సిబ్బంది కంగారుపడిపోయారు. వెంటనే హోటల్లో ఉన్న ఇడ్లీ పిండిని కింద పడేశారు. భయపడిపోయిన హోటల్ యజమాని హోటల్కు తాళం వేసి పరారయ్యాడు. ఈ దృశ్యాలను ఒక వ్యక్తి తన సెల్ ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడంతో వైరల్ అయింది.