BiggBoss : బిగ్ బాస్ రాజ్యం.. రాజులు.. రాజ్యాలు.. కొట్టుకున్న కంటెస్టెంట్లు

తాజాగా బిగ్ బాస్ లో 'రాజ్యానికి ఒక్కడే రాజు' టాస్క్‌ ఆసక్తిగా సాగింది. కంటెస్టెంట్స్ ని రెండు రాజ్యాలుగా విడగొట్టారు. ఒక రాజ్యానికి సన్నీ రాజు. మరో రాజ్యానికి యాంకర్ రవి రాజు

BiggBoss : బిగ్ బాస్ రాజ్యం.. రాజులు.. రాజ్యాలు.. కొట్టుకున్న కంటెస్టెంట్లు

Bb

BiggBoss :  ఈ సారి బిగ్ బాస్ లో కొత్త కొత్త టాస్కులు ఇస్తూ ఆటని మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ లో ‘రాజ్యానికి ఒక్కడే రాజు’ టాస్క్‌ ఆసక్తిగా సాగింది. కంటెస్టెంట్స్ ని రెండు రాజ్యాలుగా విడగొట్టారు. ఒక రాజ్యానికి సన్నీ రాజు. మరో రాజ్యానికి యాంకర్ రవి రాజు. ఈ రెండు టీంల మధ్య పోటీలు జరుగుతున్నాయి. మొదటి లెవల్‌లో ఈ రెండు టీమ్స్ మధ్య కుస్తీ పోటీ పెట్టారు.

కుస్తీపోటీలో మొదట విశ్వ మానస్‌ను ఓడించాడు. తర్వాత యానీ మాస్టర్‌ను జెస్సీ ఓడించాడు. ప్రియాంక సింగ్‌ను శ్వేత చాలా ఈజీ గా ఓడించింది. మొత్తంగా ఈ టాస్క్‌లో యాంకర్‌ రవి రెండు పాయింట్ల ఆధిక్యంతో గెలిచాడు. ఈ రెండు రాజ్యాలకు ఖజానా ఇచ్చాడు బిగ్ బాస్. ఈ లెవెల్ లో రవి గెలవడంతో అతని ఖజానాలోకి 150 నాణాలు వచ్చాయి. ఖజానా నుంచి నాణాలు పక్క టీం వాళ్ళు దొంగిలిస్తున్నారంటూ విశ్వ ఫైర్ అయ్యాడు. విశ్వ పేరు పెట్టి ఎవరినీ తిట్టకపోవడంతో మానస్‌ ఫైర్‌ అయ్యాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరికీ మధ్య గొడవ జరిగింది.

Sharukh Khan : షారుఖ్ పార్టీలో డ్రగ్స్.. బాలీవుడ్ స్టార్ భార్యలు సైతం..

అనంతరం బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు ‘రాజుగారి గోడ’ అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఖాళీ గోడలపై హౌస్‌మేట్స్‌ వారికి నచ్చిన రాజు ఫొటోలను అతికించాల్సి ఉంటుంది. ఎండ్‌ బజర్‌ మోగే సమయానికి ఏ రాజు ఫొటోలు ఎక్కువ ఉంటే అతడే గెలిచినట్లు లెక్క. దీంతో సన్నీకి సపోర్ట్‌గా మానస్‌, జెస్సీ దిగారు. రవికి మద్దతుగా వచ్చిన విశ్వను ఆపేందుకు మానస్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. జెస్సీ అయితే ఏకంగా శ్రీరామచంద్రను ఎత్తి పడేశాడు. దీంతో వీళ్ళిద్దరూ కాసేపు కొట్టుకున్నారు. అయితే శ్రీరామే జెస్సీని కొడుతున్నాడని, అది కళ్లారా చూశానని ఆవేశపడ్డాడు సన్నీ. దీంతో శ్రీరామ్ కి ఇంకా కోపం వచ్చి ఏకంగా గోడను మొత్తం కూల్చేశాడు. చివరగా ఈ టాస్క్‌లో సన్నీ విజయం సాధించాడు.

Vidhyullekha Raman : స్విమ్ సూట్ వేసుకుంటే విడాకులు ఇవ్వాలా??

తర్వాత బిగ్‌బాస్‌ ‘లాక్కో లాక్కో తాడు’ అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో ఇద్దరు రాజులతో పాటు, వారి ప్రజలు కూడా తాడును లాగాల్సి ఉంటుంది. ఏ రాజు ఇంకో రాజ్యంలోని ప్రజలను తమవైపు లాక్కుంటారో వారే గెలిచినట్లు అని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ బాగా ఇంటరెస్టింగ్ గా సాగింది. రెండు టీంలు పోటీ పడి మరీ తాడుని లాగాయి. చివరకి ఈ టాస్క్‌లో సన్నీ గెలవడంతో తన టీం వాళ్లంతా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.