Delhi: కబడ్డీ క్రీడాకారిణిపై కోచ్ అత్యాచారం.. బాధితురాలి ఫిర్యాదు.. ఢిల్లీ కోర్టులో విచారణ

కోచ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డట్లు ఒక కబడ్డీ క్రీడాకారిణి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. బాధితురాలు గతంలో జాతీయ మహిళా కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. అత్యాచార ఘటనపై ద్వారకలోని బాబా హరిదాస్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Delhi: కబడ్డీ క్రీడాకారిణిపై కోచ్ అత్యాచారం.. బాధితురాలి ఫిర్యాదు.. ఢిల్లీ కోర్టులో విచారణ

Delhi: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కోచ్‌లపై క్రీడాకారులు ఇటీవలే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇంకా తేలకముందే క్రీడారంగంలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. కోచ్ తనపై
అత్యాచారానికి పాల్పడ్డట్లు ఒక కబడ్డీ క్రీడాకారిణి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Kakani Govardhan Reddy: నెల్లూరు రూరల్‌లో ఎక్కువ మెజారిటీ సాధిస్తాం: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. బాధితురాలు గతంలో జాతీయ మహిళా కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. అత్యాచార ఘటనపై ద్వారకలోని బాబా హరిదాస్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2012లో బాధితురాలు కబడ్డీ ఆటలో పాల్గొనేందుకు హిరాన్‌కుడ్నాలో సిద్ధమైంది. ఆ తర్వాత కొంతకాలానికి.. అంటే 2015లో కోచ్ జోగిందర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన అనుమతి లేకుండా తనతో లైంగిక చర్యలకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది. అలాగే 2018లో తనకు వచ్చిన ప్రైజ్ మనీలో వాటా ఇవ్వాల్సిందిగా బెదిరించాడని, దీంతో అతడి బ్యాంక్ అకౌంట్‌కు రూ.43.5 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలిపింది.

Turkey, Syria Earthquakes : టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు.. వేలాది భవనాలు నేల మట్టం, 3600లకు చేరిన మృతుల సంఖ్య

అనంతరం 2021లో బాధితురాలికి వివాహమైంది. అప్పటి నుంచి జోగిందర్ మళ్లీ తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తన ప్రైవేటు ఫొటోలు లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. అత్యాచార ఘటనపై బాధితురాలు కోర్టులో కూడా వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు జోగిందర్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీసీపీ హర్ష వర్ధన్ చెప్పారు.