ICMR On Corona 4thwave : కరోనా ఫోర్త్ వేవ్ టెన్షన్.. ఐసీఎంఆర్ కీలక ప్రకటన

దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి కలకలం చెలరేగింది. తగ్గినట్టే తగ్గిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.(ICMR On Corona 4thwave)

ICMR On Corona 4thwave : కరోనా ఫోర్త్ వేవ్ టెన్షన్.. ఐసీఎంఆర్ కీలక ప్రకటన

Icmr On Corona 4thwave

ICMR On Corona 4thwave : దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి కలకలం చెలరేగింది. తగ్గినట్టే తగ్గిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ కరోనా భయాలు మొదలయ్యాయి. పెరుగుతున్న కేసులు.. కొవిడ్ ఫోర్త్ వేవ్ కు సంకేతం అనే ప్రచారం జరుగుతోంది. కరోనా నాలుగో దశ వార్తలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

దీనిపై ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) స్పందించింది. కరోనా ఫోర్త్ వేవ్ పై భయాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. కేవలం కొన్ని జిల్లాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న విషయాన్ని ఇటీవలి డేటా వెల్లడిస్తోందని ఐసీఎంఆర్ తెలిపింది. దీన్ని ఫోర్త్ వేవ్ గా భావించలేమని, కొన్నిచోట్ల స్థానికంగా కేసులు ఎక్కువ వస్తున్నాయని వివరణ ఇచ్చింది.(ICMR On Corona 4thwave)

Coronavirus: భారత్‌లో కొత్తగా 3,324 కొవిడ్ కేసులు.. 40 మంది మృతి

”ఆయా ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా కరోనా టెస్టులు చేయడం లేదు. తక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేసినప్పుడు వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్య ఆధారంగా ఆ ప్రాంతంలో కరోనా అధికంగా ఉందని చెప్పలేము. అధిక సంఖ్యలో టెస్టులు చేసినప్పుడు ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తేనే అక్కడ కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నట్టు భావించాలి” అని ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీరన్ పాండా విశ్లేషించారు.

జిల్లాల స్థాయిల్లో కేసుల పెరుగుదల కనిపిస్తోందన్న సమీరన్ పాండా… దాని ఆధారంగా యావత్ దేశం నాలుగో దిశగా వెళ్తున్నట్టుగా చెప్పడం సరికాదని అన్నారు. టెస్టింగ్ రేషియో ఆధారంగా కొన్ని లోకల్ స్థాయిల్లో కేసుల పెరుగుదలను గుర్తించామన్నారాయన. దాని అర్ధం రాష్ట్రాలన్నీ కోవిడ్ గుప్పిట్లో ఉన్నట్టు కాదన్నారు. దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఆసుపత్రుల్లో చేరికలు పెరగలేదన్నారు. అదీ కాకుండా, ఇంతవరకూ కొత్త వేరియంట్ ఏదీ గుర్తించనందున ఇప్పటికిప్పుడు నాలుగో వేవ్‌ వస్తుందనడానికి ఎలాంటి సంకేతాలు లేవని ఆయన వివరణ ఇచ్చారు. కాగా, పరీక్షలు తగ్గడం వల్ల పాజిటివిటీ రేటు ఒక్కోసారి పెరగవచ్చని చెప్పారు.(ICMR On Corona 4thwave)

Corona Virus : మూడేళ్లైనా కరోనా వైరస్‌ గురించి అంతుచిక్కడం లేదు

ఇది ఇలా ఉంటే, భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వారం క్రితం వరకు వెయ్యిలోపు కేసులు నమోదు కాగా మూడు రోజులుగా 3వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కొత్తగా 3వేల 324 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 40మంది కొవిడ్ తో మరణించారు.

Vaccine : సబ్ వేరియంట్లపై టీకా ప్రభావం కష్టమే!

కరోనా కొత్త కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గినప్పటికీ 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావటం కొంత ఆందోళనకు గురిచేస్తుంది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో 2వేల 876 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 19,092కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,23,843కు చేరింది. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4,30,79,188గా ఉంది. ఇక రికవరీల సంఖ్య 4,25,36,253గా ఉంది.