PM Modi: 8 కోట్ల మంది రైతులకు రూ.16,000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ

నూతనంగా అభివృద్ధి చేసిన బెలగావి రైల్వే స్టేషన్ భవనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి సుమారు 190 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే స్టేషన్‌ను తిరిగి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అంతే కాకుండా మరో రైల్వే ప్రాజెక్ట్ అయిన లోండా-బెలగావి-ఘటప్రభ సెక్షన్ మధ్య రైలు మార్గాన్ని డబ్లింగ్ చేశారు

PM Modi: 8 కోట్ల మంది రైతులకు రూ.16,000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ

PM Modi Releases Over ₹ 16,000 Crore For 8 Crore Farmers Under PM-KISAN

PM Modi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా 13వ విడత కింద దేశంలోని ఎనిమిది కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా 16,000 కోట్ల రూపాయల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేశారు. ఈ పథకం కింద, అర్హులైన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తారు. కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మోదీ ఈ మొత్తాన్ని విడుదల చేశారు.

KTR On Medico Preethi : మెడికో ప్రీతి కేసు.. నిందితుడు సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలిపెట్టం-మంత్రి కేటీఆర్

2019లో మోదీ ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం, నిర్దిష్ట మినహాయింపులకు లోబడి, సాగు భూమితో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భూస్వాముల రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని భూమి కలిగిన రైతు కుటుంబాలు ఈ పథకం కింద అర్హులు. ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు, ప్రాథమికంగా చిన్న, సన్నకారు కుటుంబాలకు 2.25 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

New Secretariat: కొత్త సచివాలయం ఉస్మానియా ఆసుత్రికి ఇచ్చేయాలట.. సీఎంకు డాక్టర్స్ అసోసియేషన్ లేఖ

ఇక, నూతనంగా అభివృద్ధి చేసిన బెలగావి రైల్వే స్టేషన్ భవనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి సుమారు 190 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే స్టేషన్‌ను తిరిగి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అంతే కాకుండా మరో రైల్వే ప్రాజెక్ట్ అయిన లోండా-బెలగావి-ఘటప్రభ సెక్షన్ మధ్య రైలు మార్గాన్ని డబ్లింగ్ చేశారు. దీన్ని సైతం సోమవారం మోదీ జాతికి అంకితం చేశారు. ఈ డంబ్లింగ్ పూర్తవడం ద్వారా రద్దీగా ఉండే ముంబై – పూణె – హుబ్బల్లి – బెంగళూరు రైలు మార్గంలో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుందని, ఈ ప్రాంతంలో వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి దారి తీస్తుందని మోదీ అన్నారు.