Rajamouli : పాకిస్తాన్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు రాజమౌళి సంచలన రిప్లై..

తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఓ సినిమా గురించి రాజమౌళిని ఉద్దేశించి ట్వీట్ చేయగా రాజమౌళి రిప్లై ఇవ్వడంతో ఆ ట్వీట్స్ వైరల్ గా మారాయి.

Rajamouli : పాకిస్తాన్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు రాజమౌళి సంచలన రిప్లై..

Rajamouli sensational tweet on pakisthan while replying Anand Mahindra tweet

Rajamouli :  బాహుబలి(Bahubali) సినిమాతో ఇండియా(India) అంతా పాపులారిటీ తెచ్చుకున్న రాజమౌళి RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. RRR సమయంలో హాలీవుడ్(Holywood) టాప్ టెక్నీషియన్స్, టాప్ డైరెక్టర్స్ సైతం రాజమౌళిని అభినందించారు. ప్రపంచమంతటా రాజమౌళి సినిమా టేకింగ్ కి ఫిదా అయిపోయింది. ఇన్నాళ్లు అసాధ్యం అనుకున్న ఆస్కార్(Oscar) అవార్డును రాజమౌళి నాటు నాటు(Natu Natu) సాంగ్ తో తీసుకొచ్చి మరో సరికొత్త చరిత్ర సృష్టించారు.

దీంతో రాజమౌళి నెక్స్ట్ సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్వరలో మహేష్ బాబుతో రాజమౌళి గ్రాండ్ స్కేల్ లో సినిమా తీయబోతున్నాడు. ఆ తర్వాత కూడా మహాభారతం తీస్తాడని అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఓ సినిమా గురించి రాజమౌళిని ఉద్దేశించి ట్వీట్ చేయగా రాజమౌళి రిప్లై ఇవ్వడంతో ఆ ట్వీట్స్ వైరల్ గా మారాయి.

ఆనంద్ మహీంద్రా సింధు నాగరికతను చూపించే హరప్పా, మొహంజొదారోకు సాంబంధించిన ఓ ఫోటోని షేర్ చేసి..ఇవి మన చరిత్రను ఇంకా సజీవంగా చూపించి, వాటి గురించి మాట్లాడే చిత్రాలు. మన ప్రాచీన నాగరికత గురించి చెప్తూ ఒక మంచి సినిమా తీసి ప్రపంచానికి చెప్పాలని రాజమౌళి గారిని కోరుతున్నాను అని ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ కి రాజమౌళి స్పందించి.. అవును సర్, నేను ధోలావీర(గుజరాత్ లోని హరప్పా నాగరికత ఉన్న ఊరు)లో మగధీర షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చాలా పురాతనమైన చెట్టుని చూశాను. అది శిలాజంగా మారిపోయి ఉంది. అప్పుడే ఈ చెట్టు ద్వారా సింధు నాగరికత ఎదుగుదల, పతనం గురించి చెప్పేలా ఒక సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత నేను కొన్నాళ్ళకు పాకిస్తాన్ కి వెళ్ళాను. ఆ కథ కోసం మొహంజొదారోని సందర్శించడానికి చాలా ప్రయత్నించాను. కానీ నాకు పాకిస్థాన్ పర్మిషన్ ఇవ్వలేదు అని ట్వీట్ చేశారు.

Celebrity Kids : బయటి ప్రపంచానికి దూరంగా సెలబ్రిటీ పిల్లలు.. అసలు చూపించరా??

దీంతో రాజమౌళి, ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రేక్షకులు, అభిమానులు రాజమౌళిని కుదిరితే ఈ సినిమా కూడా తీయమని కామెంట్స్ పెడుతున్నారు.