Acharya: ఆచార్య ఈవెంట్‌లో జక్కన్న మెగా అనౌన్స్‌మెంట్..?

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆచార్య’ సినిమాను ఎట్టకేలకు ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ....

Acharya: ఆచార్య ఈవెంట్‌లో జక్కన్న మెగా అనౌన్స్‌మెంట్..?

Acharya

Acharya: మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆచార్య’ సినిమాను ఎట్టకేలకు ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో మెగాస్టార్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‍‌ను ఏప్రిల్ 23న సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్..?

అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకోవడంతో, జక్కన్నతో ఆచార్య సినిమా ప్రమోషన్స్ చేయిస్తే ఈ సినిమాపై కూడా అదే రేంజ్‌లో ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేయొచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ ప్రీరిలీజ్ వేడుకకు జక్కన్నను పిలవడం వెనక మరో ఇంట్రెస్టింగ్ అంశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Acharya: ఆచార్య కోసం వస్తున్న వీరమల్లు..?

ఆచార్య చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో రాజమౌళి ఓ సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అది మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ అయ్యి ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మహేష్ బాబు కూడా గెస్ట్‌గా రాబోతున్నాడని.. ఆయన ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడని.. అంతేగాక జక్కన్న-మహేష్ బాబు మూవీ కూడా త్వరలో పట్టాలెక్కనుండటంతో వారి కాంబోలో రాబోయే సినిమా గురించి కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఆచార్య ప్రీరిలీజ్ వేడుకలో రాబోయే ఆ మెగా అనౌన్స్‌మెంట్ ఏమిటో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.