Rythu Bandhu : డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు..!

రైతుబంధు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వెచ్చించే రూ. 7వేల 500 కోట్ల నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థికశాఖ అధికారులు..

Rythu Bandhu : డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు..!

Rythu Bandhu

Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతుబంధు డబ్బులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన నిధుల పంపిణీ అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. రైతుబంధు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వెచ్చించే రూ. 7వేల 500 కోట్ల నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థికశాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. డిసెంబర్ 15 నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎకరాకు రూ.5 వేల చొప్పున కోటిన్నర లక్షల ఎకరాలకు రూ.7,500 కోట్లు అవసరం అవుతాయి.

SBI Services : నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్.. ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్

గత వానాకాలం సీజన్‌లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలున్న వారికి రైతుబంధు నగదును ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిలో పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

గత వానాకాలం సీజన్‌కు సంబంధించి జూన్‌ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోటి ఎకరాలకు నిధుల పంపిణీ జరిగింది.

Cyber Fraud : గూగుల్‌‌లో సెర్చ్ చేసి రూ. 19 వేలు పొగొట్టుకొన్న యువతి

ఈ యాసంగి సీజన్ లో నిధుల పంపిణీ మరింత పెరిగే అవకాశముంది. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూ విస్తీర్ణం పెరిగితే బడ్జెట్‌ కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే రూ.7,500 కోట్లు అవసరమని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి. కాగా, యాసంగిలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయినప్పటికి రైతులకు ఎప్పటిలాగే రైతుబంధు డబ్బులు అందిస్తామని సీఎం వెల్లడించారు.