Telangana Police : పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు

తెలంగాణ పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి రంగం సిధ్దమయ్యింది.  ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా పోలీసు శాఖలో అవసరమైన సిబ్బంది నియామకానికి  నోటిఫికేషన్   

Telangana Police : పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు

Telangana Police

Telangana Police  : తెలంగాణ పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి రంగం సిధ్దమయ్యింది.  ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా పోలీసు శాఖలో అవసరమైన సిబ్బంది నియామకానికి  నోటిఫికేషన్   విడుదల  చేసేందుకు అనుతి నిమిత్తం ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించింది పోలీసు శాఖ.

ప్రభుత్వం ఈ  వారంలో   గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే జరిగితే తాజా ఉద్యోగాల భర్తీలోనూ పోలీస్‌ శాఖనే ముందు నోటిఫికేషన్‌ ఇచ్చినట్లవుతుంది. ఇక ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలో తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్, సివిల్, ఆర్మ్‌డ్‌(ఏఆర్‌), కమ్యూనికేషన్‌ విభాగాల్లో భర్తీ ఉండనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
Also Read : Replacement : టీఎస్ఏసీఎస్ లో 34 ఖాళీల భర్తీ
1,500కు పైగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ పోస్టులను పోలీస్‌ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. నూతన జిల్లాలు, రేంజ్‌లను దృష్టిలో పెట్టుకొని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక మిగిలినవన్నీ కానిస్టేబుల్‌ పోస్టులు కాగా, వాటిని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌), టీఎస్‌ఎస్‌పీ, కమ్యూనికేషన్‌ విభాగాల్లో నియామకానికి ప్రతిపాదించినట్లు పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి

పోలీసు శాఖలో ఇప్పటి వరకు  28 వేల పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు  అయిన నాటి  నుంచి ఇప్పటివరకు పోలీస్‌ శాఖ దాదాపు 28,000 పోస్టులను భర్తీ చేసింది. సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్, స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌(టీఎస్‌ఎస్‌పీ), పోలీస్‌ కమ్యూనికేషన్, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ (పీటీవో) విభాగాల్లోని కానిస్టేబుల్, సబ్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీని మూడు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేశారు. తాజాగా 18,334 పోస్టుల్లో 80 శాతం కానిస్టేబుల్, 20 శాతం సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, కొత్త సర్కిల్, పోలీస్‌స్టేషన్లకు మరింత మంది సిబ్బందిని కేటాయించేందుకు ఈ నియామకాలు చేపట్ట నున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.