Tirumala : ఏప్రిల్ 1 నుండి శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లు పునరుధ్ధరణ

శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభించి భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని తిరుమల తిరుపతి  దేవస్ధానం నిర్ణ‌యించింది.  సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌

Tirumala : ఏప్రిల్ 1 నుండి శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లు పునరుధ్ధరణ

Tirumala

Tirumala : కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభించి భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని తిరుమల తిరుపతి  దేవస్ధానం నిర్ణ‌యించింది.  సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌ పాద‌ ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్స‌వం, డోలోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌లు నిర్వ‌హిస్తారు.

కోవిడ్‌-19 ప‌రిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొన‌సాగుతుందని టీటీడీ తెలిపింది. అదేవిధంగా, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవలకు సంబంధించి భ‌క్తులు నేరుగా పాల్గొనే   విధానంతో  పాటు వ‌ర్చువ‌ల్ విధానం కూడా కొన‌సాగుతుంది. వ‌ర్చువ‌ల్ సేవ‌ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు ఆయా సేవ‌ల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదు. వారికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌డంతో  పాటు ప్ర‌సాదాలు అందించ‌డం జ‌రుగుతుంది.

Also Read : AP Cinema Ticket Prices : ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ

అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవ‌లను బుక్ చేసుకున్న వారిని, ఉద‌యాస్త‌మాన సేవ, వింశ‌తి వ‌ర్ష ద‌ర్శిని సేవ‌లు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు అనుమ‌తిస్తారని టీటీడీ తెలిపింది.