Akhanda: బాలయ్య శివతాండవానికి ఏడాది పూర్తి!

నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అప్పటికే ఈ కాంబినేషన్‌లో రెండు సినిమాలు రావడం, ‘అఖండ’తో మూడోసారి ఈ కాంబినేషన్ సెట్ అవడంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Akhanda: బాలయ్య శివతాండవానికి ఏడాది పూర్తి!

Balakrishna Akhanda Movie Completes 1 Year

Akhanda: నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అప్పటికే ఈ కాంబినేషన్‌లో రెండు సినిమాలు రావడం, ‘అఖండ’తో మూడోసారి ఈ కాంబినేషన్ సెట్ అవడంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?

ఇక ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బోయపాటి తనదైన మార్క్ మాస్ యాక్షన్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలయ్య చేసిన శివతాండవం గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా ప్రభావం నుండి అప్పుడే జనాలు బయటకు వస్తుండటం, సినిమా థియేటర్లకు జనాలు రారని క్రిటిక్స్ ఎద్దేవా చేసినా కూడా అఖండ టీమ్ ఈ సినిమాపై నమ్మకంతో 2022 డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.

Akhanda: ఓటీటీలో ‘అఖండ’ విజయం.. ఏకంగా టాప్!

అఘోరాగా బాలయ్య శివతాండవం జనాలకు పూనకాలు తెప్పించింది. దానికి తోడుగా థమన్ థండరింగ్ మ్యూజిక్‌తో థియేటర్లు రీసౌండ్ వచ్చాయి. ఈ సినిమాకు తొలిషో నుండే అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో రిపీట్ ఆడియెన్స్ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి, కరోనా భయాన్ని సినీ ఇండస్ట్రీ నుంచి తరిమికొట్టింది. అఖండ సినిమాతో బాలయ్య టాలీవుడ్‌కు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి ఏడాది పూర్తవడంతో సోషల్ మీడియాలో అఖండ మరోసారి ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా, మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.110 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇటీవల ఈ సినిమాను గోవాలో నిర్వహించిన 53వ IFFIలో ప్రదర్శించారు.