సొంత కథను రెడీ చేసుకునే పనిలో మెగా మేనల్లుడు
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం అయినా తనకంటూ సొంత ఇమేజ్ కోసం కష్టపడుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన ఈ యంగ్ హీరో, తరువాత వరుస ఫెయిల్యూర్స్తో కష్టాల్లో పడ్డాడు. దీంతో తన కోసం తానే ఓ కథను రెడీ చేసుకునే పనిలో ఉన్నాడట సాయి ధరమ్ తేజ్. ‘నా పేరు విజయ్.. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలో ఎప్పుడు వస్తుందో’ అంటూ చిత్ర లహరి టీజర్తో సందడి చేస్తున్నారు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే ఓ లైన్ను సిద్ధం చేసుకున్న సాయి, పూర్తి స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
Read Also : మరో మల్టీస్టారర్లో విక్టరీ వెంకటేష్!
ప్రస్తుతం ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రలహరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ ‘చిత్ర లహరి’ మూవీలో గుబురు గడ్డంతో డిఫరెంట్గా కనిపిస్తున్నాడు సాయి ధరమ్.. పాత్ర కోసం గడ్డం పెంచాడా లేక రచయితగా మారాను అని సింబాలిక్గా చెప్పడం కోసం గెడ్డం పెంచాడో చూడాలి.