Sushant Singh Rajput సూసైడ్..కేసు CBI కి !

  • Published By: madhu ,Published On : July 17, 2020 / 06:18 AM IST
Sushant Singh Rajput సూసైడ్..కేసు CBI కి !

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు ? ఇందుకు గల కారణాలు ఏంటీ ? ఎవరైనా హత్య చేశారా ? అనే దానికి త్వరలోనే సమాధానాలు దొరకనున్నాయి. ఎందుకంటే..ఇందులోకి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎంటర్ అయ్యారు.
Sushanth Singh Rajputh ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బీహార్ ఎంపీ పప్పు యాదవ్ రాసిన లేఖను సంబంధిత శాఖకు హోం మంత్రి అమిత్ షా ఫార్వర్డ్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా పప్పు యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు షా సంతకం చేసిన లేఖను అందులో పొందుపరిచారు.

షా గారు తలుచుకుంటే…సుశాంత్ కేసులో సీబీఐ విచారణ జరుగుతుంది. దీనిని ఆపొద్దు..బీహార్ కు చెందిన గౌరవ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ కోసం హోం మంత్రిని లేఖ ద్వారా కోరడం జరిగిందన్నారు. దీనిపై ఆయన స్పందించి లేఖను ఫార్వర్డ్ చేశారని వెల్లడించారు.
బాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ అయిపోయిన సుశాంత్ మరణం అందర్నీ కలిచివేసింది. 2020, జూన్ 14వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బాలీవుడ్ ను కుదిపేసింది. హిందీ పరిశ్రమలో జరుగుతున్న కారణాలు, గుత్తాధిపత్యం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు బాహాటంగానే విమర్శలు చేశారు.
దీనిపై సీబీఐ విచారణ జరిపించాలనే డిమాండ్స్ వినిపించాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని రోజుల క్రితం టీవీ, నటుడు శేఖర్ సుమన్ ఓ ఫోరాన్ని ప్రారంభించారు.
మరోవైపు ముంబై పోలీసులు దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలువురిని విచారించారు. సుశాంత్ సూసైడ్ చేసుకున్నారని నిర్ధారించారు. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ…సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి..హోం మంత్రి షాను కోరారు.

ఈ మేరకు ఆమె గురువారం ట్విట్టర్ వేదికగా అమిత్ షాకు రెండు వరుస ట్వీట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం సుశాంత్ చనిపోవడానికి కారణం రియా అంటూ ఆమెపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం సుశాంత్ సూసైడ్ లో సీబీఐ విచారణ కోరుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.