CBI Raids: నేను ఎక్కడున్నానో తెలియట్లేదా?.. ఎక్కడికి రావాలో చెప్పండి మోదీ జీ: లుకౌట్ నోటీసులపై మనీశ్ సిసోడియా

కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) తనకు లుకౌట్ నోటీసు పంపించడం పట్ల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. ‘మీరు చేసిన దాడులు అన్నీ విఫలమయ్యాయి. దాడుల్లో మీకు ఏమీ దొరకలేదు. ఒక్క రూపాయి కూడా లభ్యం కాలేదు. ఇప్పుడు మీరు లుకౌట్ నోటీసు జారీ చేశారు. నేను కనపడట్లేనని అంటున్నారు. మోదీజీ ఏమిటీ ఈ గిమ్మిక్కు. నేను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను. నేను ఎక్కడున్నానో తెలియట్లేదా? నేను ఎక్కడికి రావాలో చెప్పండి’ అని మనీశ్ సిసోడియా ట్వీట్లు చేశారు.

CBI Raids: నేను ఎక్కడున్నానో తెలియట్లేదా?.. ఎక్కడికి రావాలో చెప్పండి మోదీ జీ: లుకౌట్ నోటీసులపై మనీశ్ సిసోడియా

CBI Raids

CBI Raids: కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) తనకు లుకౌట్ నోటీసు పంపించడం పట్ల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. ‘మీరు చేసిన దాడులు అన్నీ విఫలమయ్యాయి. దాడుల్లో మీకు ఏమీ దొరకలేదు. ఒక్క రూపాయి కూడా లభ్యం కాలేదు. ఇప్పుడు మీరు లుకౌట్ నోటీసు జారీ చేశారు. నేను కనపడట్లేనని అంటున్నారు. మోదీజీ ఏమిటీ ఈ గిమ్మిక్కు. నేను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను. నేను ఎక్కడున్నానో తెలియట్లేదా? నేను ఎక్కడికి రావాలో చెప్పండి మోదీ జీ’ అని మనీశ్ సిసోడియా ట్వీట్లు చేశారు.

కాగా, మనీశ్ సిసోడియాతో పాటు మరో 12 మందికి సీబీఐ లుకౌట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో మొత్తం 15 మంది పేర్లు ఉన్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందంటూ ఆప్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కొత్త మద్యం పాలసీని రద్దుచేసి, పాత విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చారు.

Hijab Row: హిజాబ్ ధరిస్తే కాలేజీలకు రానివ్వడం లేదంటూ టీసీలు తీసుకుని వెళ్ళిపోయిన 145 మంది విద్యార్థినులు