Kumbh Mela: కుంభమేళాలో రెండ్రోజుల్లో వెయ్యి కొవిడ్ కేసులు

ఉత్తరాఖాండ్ లోని హరిద్వార్ లో 594కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 2వేల 812కు..

Kumbh Mela: కుంభమేళాలో రెండ్రోజుల్లో వెయ్యి కొవిడ్ కేసులు

Kumbhmela

Kumbha Mela: ఉత్తరాఖాండ్ లోని హరిద్వార్ లో 594కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 2వేల 812కు చేరింది. మహాకుంభ్ సందర్భంగా వేల సంఖ్యలో పోగవడంతో వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సోమవారానికే హరిద్వార్ లో 408కేసులు రిజిష్టర్ అయ్యాయి.

గడిచిన 24గంటల్లో ఉత్తరాఖాండ్ లో 13కొవిడ్ మృతులు, వెయ్యి 925కేసులు నమోదైయ్యాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఒకవైపు, హాస్పిటల్స్ బెడ్ లు లేకపోవడం మరోవైపు ఉన్నప్పటికీ గుంపులుగా ఘాట్ ల వద్ద కనిపిస్తూనే ఉన్నారు.

ఇక ఈ పండుగ జరుపుకోవడానికి గంగానది ఒడ్డున లక్షల్లో జనాలు ఎదురుచూస్తున్నారు. సోమవారం సంప్రదాయబద్ధమైన స్నానం చేసేందుకు దాదాపు లక్షల మంది కేంద్ర ఆరోగ్య శాఖ నిర్దేశించిన కొవిడ్ ప్రొటోకాల్స్ ఖాతరు చేయడం లేదు. సోషల్ డిస్టెన్స్ లేకపోవడమే కాకుండా, మాస్క్ లు లేకుండా తిరుగుతూ కనిపిస్తున్నారు.

ఉత్తరాఖాండ్ లో మొత్తం లక్షా 12వేల 71కేసులు నమోదు కాగా వెయ్యి 780మృతులు సంభవించాయి. దేశవ్యాప్తంగా 24గంటల్లో వరుసగా ఏడో రోజూ లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.