Delhi Monkey Pox : ఢిల్లీలో రెండో మంకీపాక్స్ కేసు

ఢిల్లీలో రెండోమంకీ పాక్స్ కేసు వెలుగు చూసింది. ఢిల్లీలో నివసిస్తున్న 35 ఏళ్ల  నైజీరియన్  మంకీ పాక్స్ బారిన పడ్డాడు.

Delhi Monkey Pox : ఢిల్లీలో రెండో మంకీపాక్స్ కేసు

Delhi monkey pox

Delhi Monkey Pox :  ఢిల్లీలో రెండోమంకీ పాక్స్ కేసు వెలుగు చూసింది. ఢిల్లీలో నివసిస్తున్న 35 ఏళ్ల  నైజీరియన్  మంకీ పాక్స్ బారిన పడ్డాడు. ఇటీవల అతను విదేశీ ప్రయాణాలు ఏమీ చేయలేదని తెలిసింది.   దేశంలో మంకీ పాక్స్ బారిన పడినవారి సంఖ్య ఆరుకు చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మంకీ పాక్స్ లక్షణాలు సోకిన నైజీరియన్ ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్నాడు.  గ‌త ఐదు రోజులుగా జ్వ‌రం, బొబ్బ‌ల‌తో బాధ‌ప‌డుతున్నాడు. అత‌ని వ‌ద్ద నుంచి సేక‌రించిన ర‌క్త న‌మూనాల‌ను పుణెలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ (ఎన్ఐవీ)కి పంపారు.

అత‌డికి మంకీ పాక్స్ సోకిన‌ట్లు సోమ‌వారం రిపోర్టు వ‌చ్చింద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.  ఆఫ్రికా ఖండ సంత‌తికి చెందిన మ‌రో ఇద్ద‌రు అనుమానిత రోగులు కూడా లోక్ నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి కూడా మంకీ పాక్స్ సోకి ఉండొచ్చున‌ని భావిస్తున్నారు.  దేశ రాజధాని ఢిల్లీలో మొదటి మంకీ పాక్స్ కేసు జులై 24న నమోదయ్యింది. కేరళలో మూడు కేసులు నమోదయ్యాయి. అందులో 22 ఏళ్ల యువకుడు మంకీ పాక్స్ వ్యాధితో మరణించాడు. రాజస్ధాన్ లోని కిషన్ గఢ్ కు చెందిన 20 ఏళ్ళ యువకుడికి మంకీపాక్స్ సోకింది. అతడిని జైపూర్ లోని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

Also Read : Uma Maheshwari : ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య.. కారణం ఏంటి? అసలేం జరిగింది?