ఢిల్లీలో దుమ్ము తుఫాన్..ఒక్కసారిగా మారిన వాతావరణం
దేశ రాజధానిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం(మే-14,2020) సాయంత్రం ఢిల్లీ-NCR(నేషనల్ క్యాపిటల్ రీజియన్)వ్యాప్తంగా ధూళి తుపాన్, బలమైన గాలులతో మధ్యాహ్నాం 4గంటల సమయంలోనే చీకటిగా మారిపోయింది. రోడ్లపైకి వచ్చేవారు వాహనాలకు లైట్లు వేసుకుని వస్తున్నారు.
మే 13-14 మధ్య ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తాజా వర్షపాతం మరియు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని MeTడిపార్ట్మెంట్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో గురువారం నాలుగు రాష్ట్రాలు,మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించబడింది.
ఆదివారం(మే-10,2020) కూడా ఢిల్లీ,నోయిడానిధూళి తుపాన్ ముంచెత్తింది. దుమ్ము వ్యాపించడంతో ఢిల్లీ,నోయిడాలోని పగటిపూటే చీకట్లు అలుముకున్నాయి. వాతావరణంలో మార్పుతో ఢిల్లీ వ్యాప్తంగా వర్షం కురిసిన విషయం తెలిసిందే.
#WATCH Dust storm & strong winds hit parts of Delhi, visuals from Janpath area. pic.twitter.com/wePKOOMQUD
— ANI (@ANI) May 14, 2020