Haryana – UP border : రైతు ఐడియా అదిరింది..బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్
దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. హర్యానా, ఉత్తర్ప్రదేశ్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసించే ఆ రైతు తన ట్రాక్టర్ను బుల్లెట్ ప్రూఫ్గా మార్చాడు.
Bullet Proof Tractors : దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. హర్యానా, ఉత్తర్ప్రదేశ్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసించే ఆ రైతు తన ట్రాక్టర్ను బుల్లెట్ ప్రూఫ్గా మార్చాడు. ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడేందుకు తన వాహనాన్ని ఇలా తీర్చిదిద్దుకున్నానన్నాడు రాజేశ్.
ఉత్తర్ప్రదేశ్, హర్యానా మధ్య ఎప్పటి నుంచో జలవివాదం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాల కారణంగా చాలా సార్లు ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ సమస్య నుంచి బయట పడడానికి డిఫరెంట్గా ఆలోచించాడు రాజేశ్. 5లక్షల ఖర్చు చేసి తన ట్రాక్టర్ను బుల్లెట్ ప్రూఫ్గా మార్చేశాడు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేశానని రైతు రాజేంద్ర చెప్పాడు.
ఈ సమస్య నుంచి తనను తాను కాపాడుకోవడానికి ట్రాక్టర్ను బుల్లెట్ ప్రూఫ్ చేయించానన్నాడు. ఇప్పుడు తమ ప్రాంతంలోని రైతులు ఇదే విధానాన్ని అనుసరించాలనుకుంటున్నారని రాజేశ్ వెల్లడించారు. గత వారం తన సోదరుడితో పొలానికి వెళ్తున్నప్పుడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని… కాల్పులు కూడా జరిపారని తెలిపాడు ఆ రైతు. అయితే ఆ సమయంలో ఈ ట్రాక్టర్ కారణంగా తాము సురక్షితంగా బయటపడ్డామన్నాడు రాజేశ్.