Covid-19 vaccination: వ్యాక్సిన్ ప్రచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం పర్యటన

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ గురించి ప్రచారం చేయడానికి తానే స్వయంగా వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు.

Covid-19 vaccination: వ్యాక్సిన్ ప్రచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం పర్యటన

Mp Cm

Covid-19 vaccination: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ గురించి ప్రచారం చేయడానికి తానే స్వయంగా వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు. ఆయనతో పాటుగా మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, మేనేజ్మెంట్ కమిటీలు ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రజల్లో అవగాహన మెరుగుపరచాలని పిలుపునిచ్చారు.

ప్రజల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే తప్పక వ్యాక్సిన్ వేసుకోవాలని తెలియజేయనున్నారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాతి రోజే సీఎం ఈ రకమైన అనౌన్స్‌మెంట్ చేశారు. రాష్ట్రంలో పబ్లిక్ వెల్ఫేర్, డెవలప్మెంట్ పై ప్రధానితో చర్చించారు.

అనుకున్న సమయంలోపే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రధాని చెప్పారని… ఆయన గైడెన్స్ తోనే ప్రచారంలో పాల్గొనాలనుకుంటున్నట్లు చెప్పారు. టెస్టింగ్ ను పెంచి, పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచాలని, సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చూస్తున్నామని చెప్పారు.

కిల్ కరోనా పేరిట ప్రచారం చేపట్టి కొవిడ్ కేర్ సెంటర్లకు వెళ్లి పనులు జరుగుతున్న తీరును పరిశీలించనున్నట్లు వెల్లడించారు.