Methamphetamine Drugs : హిందూ మహాసముద్రంలో అక్రమంగా తరలిస్తున్న.. రూ.25 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

పాకిస్థాన్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ తో పాకిస్థాన్ కు ఉన్న సంబంధాలపై వివిధ దర్యాప్తు ఏజెన్సీలు విచారణ జరుపుతాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.

Methamphetamine Drugs : హిందూ మహాసముద్రంలో అక్రమంగా తరలిస్తున్న.. రూ.25 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Methamphetamine Drugs

Indian Ocean Drugs : హిందూ మహాసముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న రూ.25 వేల కోట్ల విలువైన మెథాంఫిటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత నౌకాదళంతో చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లో 2500 కిలోల మెథాంఫిటమైన్ డ్రగ్స్ పట్టుబడినట్లు ఎన్సీబీ వెల్లడించింది.

పాకిస్థాన్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ తో పాకిస్థాన్ కు ఉన్న సంబంధాలపై వివిధ దర్యాప్తు ఏజెన్సీలు విచారణ జరుపుతాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి తాజా ఘటన ఎన్సీబీ చరిత్రలో మూడో అతి పెద్దది అని అన్నారు.

Drugs : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మహిళ నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం.. విలువ రూ.41కోట్లు

కాగా, ఆదివారం (మే 14)న కేరళలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కేరళ తీరంలో భారీగా డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. అరేబియా సముద్రంలో ఇండిమన్ ఆర్మీ, ఎన్ సీబీ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో డ్రగ్స్ ను పట్టుకున్నారు. భారత సముద్ర జలాల్లో సంచరిస్తున్న ఓడ నుంచి 134 సంచుల్లో 2500 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తిని నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 12 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ డ్రగ్స్ ను ఆఫ్ఘానిస్తాన్ నుంచి సముద్ర మార్గంలో తరలిస్తుండగా అధికారులు సీజ్ చేశారు. మ్యాకమ్ తీరం నుంచి 134 బస్తాల్లో మెథామ్ సేతుమిన్ను మోసుకెళ్తోన్న మథర్ షిప్ కదికలపై నేవీ ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది.

Drugs Gang Arrest : భారీగా డ్రగ్స్ పట్టివేత.. విదేశాల నుండి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

ఆఫ్ఘానిస్తాన్ నుంచి డ్రగ్స్ తో బయలుదేరిన భారీ ఓడ ఒకటి మాక్రం తీరం వెంబడి పాక్, ఇరాన్ మీదుగా చిన్న పడవల్లోకి డ్రగ్స్ ను పంపిణీ చేసుకుంటూ వస్తుందని సమాచారం ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు గాలింపు చేపట్టారు. ఆఫ్ఘానిస్తాన్ నుంచి కేరళ తీరం ద్వారా శ్రీలంకకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

మొత్తం మూడు పడవల్లో డ్రగ్స్ తరలిస్తుండగా రెండు పడవలు తప్పించుకున్నాయి. మరోవైపు జమ్మాకశ్మీర్ లోనూ డ్రగ్స్ పట్టుబడింది. కుప్వారా పరిధిలో నలుగురు స్మగ్లర్లను ఆర్మీ అరెస్టు చేసింది. వారి నుంచి 8 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకుంది. దీని విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.