Corona Vaccine : వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా పాలు ఇవ్వొచ్చు, నిపుణుల స్పష్టత
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. అయితే టీకా విషయంలో ఇంకా పలు అనుమానాలు, సందేహాలు, భయాలు నెలకొని ఉన్నాయి. పాలిచ్చే తల్లులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నాక శిశువుకి పాలు ఇవ్చొచ్చా లేదా అని ఆలోచిస్తున్నారు. దీనిపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు.
Corona Vaccine : కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. అయితే టీకా విషయంలో ఇంకా పలు అనుమానాలు, సందేహాలు, భయాలు నెలకొని ఉన్నాయి. పాలిచ్చే తల్లులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నాక శిశువుకి పాలు ఇవ్చొచ్చా లేదా అని ఆలోచిస్తున్నారు. దీనిపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు.
కొవిడ్ టీకా విషయంలో పాలిచ్చే తల్లులు భయపడాల్సిన అసవరం లేదని నిపుణులు అంటున్నారు. టీకా తీసుకున్న తర్వాత విరామం ఇవ్వాల్సిన అవసరం లేదని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పష్టం చేశారు. టీకా తీసుకున్న తల్లులు తమ పిల్లలకు పాలివ్వడం ఆపాలని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ఒకటి రెండు రోజులు ఆగాల్సిన అవసరం కూడా లేదన్నారు.
పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా బిడ్డకు రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తల్లిలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయని, అవి పాల ద్వారా బిడ్డకు చేరి వారికీ రక్షణ లభిస్తుందని డాక్టర్లు అంటున్నారు. ఏ విధంగా చూసినా పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్ తీసుకోవడం అటు తల్లికి ఇటు బిడ్డకు ఇద్దరికీ సురక్షితమే అని తేల్చారు.
పాలిచ్చే తల్లులు కూడా కరోనా టీకాలు పొందేందుకు ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. వ్యాక్సిన్ పొందాక కనీసం గంటపాటు కూడా బిడ్డకు స్తన్యమివ్వడాన్ని ఆపాల్సిన పనిలేదని పేర్కొంది. అంతేకాదు కాన్పు అయిన వెంటనే టీకాను పొందొచ్చని ఢిల్లీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన ప్రొఫెసర్ ఖాన్ అమిర్ మరూఫ్ చెప్పారు. దీనివల్ల నవజాత శిశువుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ప్రసవం తర్వాత తల్లికి కొవిడ్ టీకాలిచ్చే విషయంలో జాప్యానికి కారణాలూ కనిపించడం లేదన్నారు.
వ్యాక్సిన్ అనంతరం.. పాలిచ్చే తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. రుతుచక్రంలో ఏ దశలోనైనా మహిళలు వ్యాక్సిన్ పొందొచ్చని స్త్రీ వైద్య నిపుణులు తెలిపారు. కొవిడ్ వల్ల గర్భిణులకు కచ్చితంగా సిజేరియన్ కాన్పులు అవుతాయని చెప్పలేమన్నారు. ‘‘ఇతరులతో పోలిస్తే గర్భిణులకు కరోనా సోకే ముప్పు ఎక్కువేమీ కాదు. అయితే ఈ వైరస్ బారినపడితే వీరిలో వ్యాధి తీవ్రం కావొచ్చు’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో గర్భిణులకూ టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం ఇందుకు అనుమతినివ్వ లేదు. కొవిడ్ టీకాలను గర్భిణులపై ప్రయోగాత్మకంగా పరీక్షించలేదని, అందువల్ల అవి వారికి ఎంతమేర సురక్షితం, ఎంతమేర సామర్థ్యాన్ని చాటుతాయన్న దానిపై డేటా లభించకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు.
మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో గర్భిణులకు వైరస్ నుంచి పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా వారికి టీకాలు ఇవ్వాలని ‘ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలాజిక్ సొసైటీస్ ఆఫ్ ఇండియా’ ప్రభుత్వానికి సిఫార్సు చేశాయన్నారు. వీరు వ్యాక్సిన్లు పొందొచ్చని డబ్ల్యూహెచ్వో చెప్పినప్పటికీ భారత్లో ఈ అంశంపై చర్చ నడుస్తోందని ‘కోయలేషన్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజీత్ రంజన్ తెలిపారు. భారత్లో ఇస్తున్న కొవిడ్ టీకాల్లో సజీవ వైరస్ లేదని, అందువల్ల గర్భిణులు, పాలిచ్చే తల్లులకు వీటివల్ల తీవ్ర దుష్ప్రభావాలేమీ ఉండబోవని ‘ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలాజిక్ సొసైటీస్ ఆఫ్ ఇండియా’ మాజీ అధ్యక్షుడు జైదీప్ మల్హోత్రా తెలిపారు.