మణిపూర్ లో తొలి కరోనా కేసు
ఈశాన్య రాష్ర్టాల్లో తొలి కరోనా కేసు నమోదు అయింది. మణిపూర్కు చెందిన ఓ యువతి.. ఇటీవలే యూకే నుంచి వచ్చింది. అయితే ఈ అమ్మాయికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది.
దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. యువతి కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉంచారు. కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ యువతి యూకేలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది. ఇక ఇప్పటి వరకు భారత్లో 470 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిది మంది మరణించారు.
See Also | ఆన్ లైన్ షాపింగ్ కూడా ప్రమాదేమే.. ‘కరోనా’ను ఆహ్వానించినట్లే!`