మణిపూర్ లో తొలి కరోనా కేసు

  • Published By: chvmurthy ,Published On : March 24, 2020 / 05:40 AM IST
మణిపూర్ లో తొలి కరోనా కేసు

ఈశాన్య రాష్ర్టాల్లో తొలి కరోనా కేసు  నమోదు అయింది. మణిపూర్‌కు చెందిన ఓ యువతి.. ఇటీవలే యూకే నుంచి వచ్చింది. అయితే ఈ అమ్మాయికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. యువతి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఈ యువతి యూకేలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది. ఇక ఇప్పటి వరకు భారత్‌లో 470 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిది మంది మరణించారు.

manipur corona case 1

manipur corona virus 2

See Also | ఆన్ లైన్ షాపింగ్ కూడా ప్రమాదేమే.. ‘కరోనా’ను ఆహ్వానించినట్లే!`