Terrorist Arrest : ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. పాకిస్తాన్ టెర్రరిస్టు అరెస్టు
భారత్కు వ్యతిరేకంగా పాక్ పన్నిన భారీ కుట్ర భగ్నమైంది. ఉగ్రవాదులను భారత్లోకి పాక్ పంపుతున్న విషయం బట్టబయలైంది. పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్టును ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Pakistan terrorist arrested : భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ పన్నిన భారీ కుట్ర భగ్నమైంది. ఉగ్రవాదులను భారత్లోకి పాకిస్తాన్ పంపుతున్న విషయం మరోసారి బట్టబయలైంది. పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్టును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ సెల్ పోలీసులు ఆ ముష్కరుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఏకే-47తోపాటు హ్యాండ్ గ్రనేడ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ఐ ఏజెంట్ అయిన ఈ ఉగ్రవాది… ఢిల్లీలో దాడులకు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫేక్ డాక్యుమెంట్లతో మనదేశంలోకి ఎంటరయ్యాడు. కానీ.. పోలీసుల అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది.
దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. జమ్ముకశ్మీర్తోపాటు దేశంలోని ప్రధాన నగారాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాద సంస్థలపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ, యూపీ, జమ్ముకశ్మీర్తోపాటు దేశవ్యాప్తంగా 18చోట్ల తనిఖీలు చేస్తోంది.
Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్..ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం
మరోవైపు.. ఎన్కౌంటర్లతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతోంది. ఉగ్రవాదుల ఏరివేతలో భారత్ దళాలు దూకుడు పెంచాయి. ఈరోజు షోపియన్లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వాళ్ల దగ్గర నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మిగిలిన ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు భద్రత దళాలు.
అటు ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవటం ఆర్మీకి పెను సవాల్గా మారింది. కొన్ని రోజులుగా సామాన్య ప్రజలే టార్గెట్గా కశ్మీర్లో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. తుపాకీ తూటాలకు అమాయకులను బలిస్తున్నారు. తుపాకీ శబ్దాలతో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. దీంతో ఉగ్రవాదుల అంతు చూసేందుకు రంగంలోకి దిగింది ఆర్మీ. నిన్న పూంచ్ సెక్టార్లో జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు భారత సైనికులు మరణించారు. అందులో నలుగురు జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉన్నారు.
Kashmiri Pandit : శ్రీనగర్ లో కశ్మీరీ పండిట్ ని కాల్చిచంపిన టెర్రరిస్టులు
మరోవైపు సురాన్ కోట్లోని మొఘల్ రోడ్డు సమీపంలో ఉన్న అడవుల్లోకి ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. LOC దాటి చార్మేర్ అడవిలో భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదుల గుంపు చొరబడినట్లు సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను మట్టు పెట్టడం కోసం వారు ఉన్న అటవీ ప్రాంతం నుంచి తప్పించుకునే అన్ని మార్గాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.