Pig Attacks Kid : షాకింగ్.. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై పంది దాడి, తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

ఓ పంది రెచ్చిపోయింది. సడెన్ గా అటాక్ చేసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (Pig Attacks Kid)

Pig Attacks Kid : షాకింగ్.. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై పంది దాడి, తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

Pig Attacks Kid : కోతులు అయిపోయాయి, కుక్కలు అయిపోయాయి, ఆవులు ఎద్దులు కూడా అయిపోయాయి. ఇప్పుడు వాటి ప్లేస్ లోకి పందులు కూడా వచ్చేశాయి. అవును, ఇప్పుడు పందుల వంతు వచ్చేసింది. పందులు కూడా మనుషులపై దాడి చేస్తున్నాయి. మీద పడి మరీ పళ్లతో అటాక్ చేస్తున్నాయి. తీవ్రంగా గాయపరుస్తున్నాయి.

మహారాష్ట్రలోని గోండా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ పంది రెచ్చిపోయింది. సడెన్ గా అటాక్ చేసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(Pig Attacks Kid)

ఓ బాలుడు తన ఫ్రెండ్స్ తో ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ముగ్గురు పిల్లలు అక్కడ ఉన్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, ఓ పంది అకస్మాత్తుగా దూసుకొచ్చింది. ముగ్గురు పిల్లలు ఉండగా.. ఓ బాబుని టార్గెట్ చేసింది. అతడిపై దూసుకొచ్చి మరీ దాడి చేసింది. పంది ఎంత స్పీడ్ గా దూసుకొచ్చిందంటే.. మిగతా ఇద్దరు పిల్లలు రోడ్డు మీద పడ్డారు. ఆ తర్వాత భయంతో వారిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Also Read..Attacked By Cow : బాబోయ్.. కొమ్ములతో యువతిని ఎత్తిపడేసిన ఆవు, తలకు తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

పంది దాడిలో బాలుడి చేతులు, కడుపు భాగంలో పలుమార్లు కరిచింది. దాన్ని తోలేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. భయంతో చిన్నారి గట్టిగా అరిచాడు. కేకలు విన్న చుట్టుపక్కల వారు అప్రమత్తమై అక్కడికి వచ్చి పందిని తరిమి కొట్టి బాబుని కాపాడారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాలుడిపై పంది దాడి స్థానికంగా కలకలం రేపింది. బాబుపై పంది దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాబుపై పంది దాడిని కళ్లారా చూసిన స్థానికులు హడలిపోయారు. కాసేపు షాక్ లో ఉండిపోయారు.

ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో కుక్కలు, ఆవులు, ఎద్దులు మనుషులపై దాడులు చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కుక్కుల దాడి ఘటనల గురించి చెప్పక్కర్లేదు.

వీధుల్లో కుక్కల స్వైరవిహారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిత్యం ఏదో ఓ ప్రాంతంలో కుక్క కాటుకు ప్రజలు ఆస్పత్రులు పాలవుతున్నారు. పిల్లలే కాదు పెద్దలపైనా దాడి చేస్తున్న ఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. ఇప్పుడు పంది కూడా దాడికి దిగడం భయాందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలను వదిలేయకుండా వారిని కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.(Pig Attacks Kid)

Also Read..Bull Attack : ఘోరం.. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఎద్దు దాడి, కొమ్ములతో పొడిచి పొడిచి చంపేసింది, వీడియో వైరల్

మొత్తంగా ఈ కోతులు, కుక్కలు, ఆవులు, ఎద్దులు, పందులకు ఏమైందోనని అంతా వర్రీ అవుతున్నారు. రోడ్డు మీదకు వచ్చినప్పడు అటు ఇటు చూసుకుని జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.