Telangana Govt : భారీ శుభవార్త.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ 1.02 కోట్ల ప్రమాద బీమా
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ.1.02కోట్ల రూపాయల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Telangana Govt
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- రూ.1.02 కోట్ల ప్రమాద బీమా
- రాష్ట్రంలోని ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ అమలు
- 5.14లక్షల మందికి ప్రయోజనం
- వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ.1.02కోట్ల రూపాయల ప్రమాద బీమా (accident insurance) ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఒక ప్రకటన విడుదల చేశారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చేది ప్రభుత్వ ఉద్యోగులు అని.. వారిని మా కుటుంబ సభ్యలుగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిసినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం ప్రతినెల క్రమం తప్పకుండా దశలవారీగా విడుదల చేస్తున్నామని అన్నారు.
ఉద్యోగులకు ప్రమాద బీమాకు సంబంధించి ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్ కో పరిధిలోని ఉద్యోగులందరికీ కోటికిపైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. సింగరేణిలో 38వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు.. వీరితోపాటు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 71,387 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 5.14లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.
