PM Modi: కరోనాతో ప్రధాని మోదీ పిన్ని మృతి

ప్రధాని నరేంద్ర మోదీ పిన్ని నర్మదాబెన్ (80) కరోనా బారినపడి కన్నుమూశారు. పదిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకడంతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.

PM Modi: కరోనాతో ప్రధాని మోదీ పిన్ని మృతి

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ పిన్ని నర్మదాబెన్ (80) కరోనా బారినపడి కన్నుమూశారు. పదిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకడంతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో మంగళవారం నర్మదాబెన్ తుదిశ్వాస విధించారు.

ప్రధాని మోదీ తండ్రి దామోదర్ దాస్ సోదరుడు జగ్జీవన్ దాస్ సతీమణి నర్మదాబెన్, కాగా జగ్జీవన్ రావు చాలా ఏళ్ళక్రితమే మృతి చెందారు. ఈమె మరణించిన విషయాన్నీ నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తెలిపారు. ఆమె మృతిపై గుజరాత్ ముఖ్యమంత్రితోపాటు బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా సంతాపం ప్రకటించారు.