PM Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు… వాళ్లంతా ఎవరో తెలుసా
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాఖీ వేడుకలు జరుపుకొన్నారు. ప్రధానికి చిన్నారులు రాఖీలు కట్టారు. ప్రధాని కార్యాలయ సిబ్బంది పిల్లలు వరుసగా ఆయన చేతికి రాఖీలు కట్టారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాఖీ పండుగ జరుపుకొన్నారు. ఆయనకు ప్రధాని కార్యాలయ సిబ్బంది కుమార్తెలు రాఖీ కట్టారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ రాఖీ వేడుకలు జరిగాయి. అయితే, రాఖీలు కట్టిన చిన్నారులంతా.. ప్రధాని కార్యాలయంలో పనిచేసే గార్డెనర్స్, డ్రైవర్లు, స్వీపర్లు, ఫ్యూన్లు, ఇతర సిబ్బంది పిల్లలు కావడం విశేషం.
Gurugram Club: క్లబ్బులో మహిళతో బౌన్సర్ల అసభ్య ప్రవర్తన… ప్రశ్నించినందుకు దాడి.. వీడియో వైరల్
చిన్నారులంతా వరుసగా ప్రధాని చేతికి రాఖీలు కట్టారు. అనంతరం ప్రధాని వారితో కాస్సేపు సరదాగా ముచ్చటించారు. చిన్నారులు రాఖీ కడుతున్న ఫొటోలను ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘‘ఈ చిన్నారులతో రక్షాబంధన్ తనకెంతో ప్రత్యేకమైనది’’ అని ప్రధాని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని కార్యాలయం విడుదల చేసింది. ఈ రోజు ఉదయం ఆయన దేశ ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు చెప్పారు.
A very special Raksha Bandhan with these youngsters… pic.twitter.com/mcEbq9lmpx
— Narendra Modi (@narendramodi) August 11, 2022
#WATCH | Prime Minister Narendra Modi celebrated #RakshaBandhan with young girls today at his residence in Delhi.
This was a special Rakshabandhan as these girls were the daughters of sweepers, peons, gardeners, drivers, etc working at PMO.
(Video Source: PMO) pic.twitter.com/eSvd6gsgHb
— ANI (@ANI) August 11, 2022