బీజేపీ సన్నిలియోన్ ను తీసుకొచ్చినా నష్టమేమీ లేదు

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2019 / 06:10 AM IST
బీజేపీ సన్నిలియోన్ ను తీసుకొచ్చినా నష్టమేమీ లేదు

పంజాబ్‌ లో బీజేపీకి సరైన అభ్యర్ధులు దొరకలేదని హోషియార్‌ పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి రాజ్‌ కుమార్‌ చబ్బేవాల్‌ విమర్శించారు. పంజాబ్‌ లో మూడు స్ధానాలకు కూడా బీజేపీకి సరైన అభ్యర్థులు లేరన్నారు. గురుదాస్‌ పూర్‌ నుంచి సన్నీ డియోల్‌ ను బీజేపీ బరిలోకి దింపిందని, బీజేపీ సన్నీడియోల్‌ను తెచ్చినా, సన్నీ లియోన్‌ ను తీసుకువచ్చినా కాంగ్రెస్‌ పెనుతుఫాన్‌ ముందు నిలవలేరని ఆయన అన్నారు. మోడీ  ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని ఆయన ఆరోపించారు. ఏడో విడతలో భాగంగా పంజాబ్‌ లో మే-19,2019న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే-23,2019న ఫలితాలు వెలువడనున్నాయి.