కొడుకు మీద ప్రేమతో..రూ. 2 కోట్లు మోసం చేసిన తల్లి

కొడుకు మీద ప్రేమతో..రూ. 2 కోట్లు మోసం చేసిన తల్లి

Supermom cons : కొడుకులు తప్పులు చేస్తే..సరిదిద్దాల్సింది పోయి…ఆ తల్లి…కూడా తప్పు చేసింది. ప్రేమతో  కొడుకు చేసిన అప్పులు తీర్చేందుకు సిద్ధ పడింది. న్యాయంగా తీరిస్తే..బాగుండేది..కానీ…ఆ తల్లి ఒక్కరిని కాదు..ఇద్దరిని కాదు..ఏకంగా 24 మందిని మోసం చేసి రూ. 2 కోట్లు దోచేసింది. ఎక్కువ వడ్డీ ఇస్తానంటూ..వారిని చీటింగ్ చేసింది. చివరకు పోలీసులకు తెలియడంతో…ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ములంద్ పోలీస్ స్టేషన్ పరిదిలో రూపాల్ పాండ్యకు ఇషాన్ కొడుకు ఉన్నాడు. ఈమె బ్యూటీ పార్లర్ నడుపుతుండేది. ఇషాన్ కు పెళ్లి అయిన తర్వాత దుబాయ్ వెళ్లిపోయాడు. ఇషాన్ కు జూదం ఆడే అలవాటు ఉంది. క్యాపినోలో రూ. 2 కోట్లు పొగొట్టుకున్నాడు. ఈ విషయం తల్లి రూపాల్ పాండ్యకు తెలిసింది. కొడుకు చేసిన అప్పులు తీర్చడానికి నడుం బిగించింది. డబ్బులు ఇస్తే..తాను ఎక్కువ వడ్డీ ఇస్తానని కస్టమర్లను, ఇతరులను నమ్మించింది. అలా.. పలువురి దగ్గర అప్పులు చేసింది.

ఇస్తానన్న టైంకు ఇవ్వలేకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అనుమానం వచ్చిన వారు..పోలీసులకు కంప్లైట్ చేశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. మొత్తం రూ. 2 కోట్ల మేర..మోసం చేసినట్లు తేలింది. ఆమెపై మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. రూపాల్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.