Supreme Court : కరోనా కట్టడికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

కరోనా కట్టడి కోసం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌, పంపిణీని ప‌ర్య‌వేక్షించ‌డానికి 12 మంది స‌భ్యుల‌తో నేష‌న‌ల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

Supreme Court : కరోనా కట్టడికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme

Supreme Court key orders : కరోనా కట్టడి కోసం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌, పంపిణీని ప‌ర్య‌వేక్షించ‌డానికి 12 మంది స‌భ్యుల‌తో నేష‌న‌ల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు శాస్త్రీయంగా, హేతుబ‌ద్ధంగా, స‌మానంగా ఆక్సిజ‌న్ అందేలా చూడ‌టం ఈ టాస్క్‌ఫోర్స్ బాధ్యత.

కరోనా చికిత్స‌కు అవ‌స‌ర‌మైన మందుల విష‌యంలోనూ ఈ టాస్క్‌ఫోర్స్ అదే ప‌ని చేయ‌నుంది. వివిధ రాష్ట్రాల‌కు కేంద్రం చేస్తున్న ఆక్సిజ‌న్ కేటాయింపుల‌ను పునఃస‌మీక్షించాల‌ని చెబుతూ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

అంబులెన్సులు, కరోనా కేర్ స‌దుపాయాలు త‌గిన‌న్ని లేక‌పోవ‌డం, హోమ్ క్వారంటైన్‌లో ఉన్న పేషెంట్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు వెస్ట్ బెంగాల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వీసీ డాక్ట‌ర్ భ‌బ‌తోష్ బిశ్వాస్ నేతృత్వం వ‌హించ‌నున్నారు.