Lakhimpur Violence : లఖింపూర్ ఘటనపై బుధవారం సుప్రీం విచారణ

దేశవ్యాప్తంగా కలకలం రేపిన అక్టోబర్-3,2021నాటి లఖింపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌

Lakhimpur Violence : లఖింపూర్ ఘటనపై బుధవారం సుప్రీం విచారణ

Sc

Lakhimpur Violence    దేశవ్యాప్తంగా కలకలం రేపిన అక్టోబర్-3,2021నాటి లఖింపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కాగా,లఖింపూర్‌ ఘటనకు సంబంధించిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఈ నెల 8న సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అక్టోబర్​ 3న లఖింపూర్​ ఖేరిలో జిల్లాలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య,కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పర్యటన నేపథ్యంలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లాయి.

ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించగా.. అనంతరం జరిగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్‌, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా పది మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​)అరెస్టు చేసింది.

లఖింపూర్​ ఘటనపై సీబీఐతో కూడిన ఉన్నత స్థాయి న్యాయ విచారణను కోరుతూ ఇద్దరు న్యాయవాదులు సీజేఐకి లేఖ రాసిన తర్వాత సుప్రీం కోర్టు ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 8న కేసు విచారణ సమయంలో సుప్రీం కోర్టు ఘటనకు బాధ్యులైన నిందితులను అరెస్టు చేయకపోవడంతో యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హత్యపై దర్యాప్తులో విశ్వాసం కలిగించేందుకు ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

ALSO READ Karnataka BJP Chief : రాహుల్ గాంధీ డ్రగ్స్ బానిస