దేవుడి దర్శనం చేసుకుంది..కోడలు కోసం నాలుక కోసుకుంది

  • Published By: madhu ,Published On : August 18, 2020 / 02:14 PM IST
దేవుడి దర్శనం చేసుకుంది..కోడలు కోసం నాలుక కోసుకుంది

కోడలు కోసం నాలుక కోసుకుంది. దేవుడి దర్శనం చేసుకున్న అనంతరం తప్పిపోయిన కోడలు క్షేమంగా ఇంటికి రావాలని దేవుడిని ప్రార్థిస్తూ…ఓ మహిళ తన నాలుకను కోసుకుంది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని Seraikela-Kharsawan జిల్లాలో NIT క్యాంపస్ లో చోటు చేసుకుంది.



ఆసుపత్రికి వెళ్లడానికి ఆ మహిళ నిరాకరించిందని, ఎలాగాలో ఆమెను జంషెడ్ పూర్ MGMMCH హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించామని ఆఫీసర్ ఇన్ ఛార్జీ శ్రీనివాస్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం కోలుకొంటోందని, ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. కానీ ప్రస్తుతం మాట్లాడలేకపోతోందన్నారు.



లక్ష్మీ నిరాల అనే మహిళ..కోడలు ఆగస్టు 14వ తేదీ సాయంత్రం బిడ్డతో తప్పిపోయిందని తెలిపారు. క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటూ…తన ఇష్టదైవం శివుడిని ఆరాధించిందన్నారు. తర్వాత..ఇంటికి వచ్చి..బ్లేడ్ తో నాలుక కోసుకుని దేవుడికి సమర్పించిందన్నారు.



వేరొకరి సలహా ప్రకారం తన భార్య ఇలా చేసిందని భర్త..నందులాల్ వెల్లడించారు. దేవుడికి నాలుక సమర్పిస్తే..కోడలు తిరిగి వస్తుందని చెప్పారన్నారు. తాము జ్యోతి కోసం గాలిస్తున్నామని, కానీ ఫలితం కనిపించడం లేదన్నారు.