కేసీఆర్ కు బాబు వార్నింగ్ : నాతో పెట్టుకుంటే మీ మూలాలు కదులుతాయి
చిత్తూరు : టీడీపీ డేటాను వైసీపీ కి ఇవ్వాలని, తెలుగు దేశం పార్టీ ని దెబ్బతీయాలని చూస్తే మీ మూలాలు కూడా కదులుతాయని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఏవరో కంప్లైంట్ చేశారని చెప్పి టీడీపీ డేటాని వైసీపీకి ఎలా ఇస్తారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. వైసీపీ కి చెందిన కొందరు హైదరాబాద్లో ఉండి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడూ జరగలేదు.
Also Read : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ : టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు
హైదరాబాద్కు ఐటీ కంపెనీలు ఎలా వచ్చాయి? ఐటీ కంపెనీలకు భరోసా ఇచ్చి హైదరాబాద్ రప్పించాను. కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారని, కేసీఆర్ ఆటలు నాదగ్గర సాగవని హెచ్చరించారు. హైదరాబాద్ ను నేను డెవలప్ చేస్తే, ఇప్పుడుమీరు నా మీదే దాడులు చేయాలని చూస్తున్నారా ? ఒకసారి మీ మూలాలు చెక్ చేసుకోవాలని ఆయన ఆవేశంగా ప్రశ్నించారు. 8 లక్షల ఓట్లు తీసేయటానికి వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని , అందుకోసం ఫామ్-7 వినియోగించారని ఆయన వివరించారు. బతికి ఉన్న వాళ్ల ఓట్లను కూడా తొలగించేంజుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.
జగన్, కేసీఆర్ లాలూచీ పడి టీడీపీని దెబ్బ తీయాలని చూస్తే మీ మూలాలు కూడా కదిలిపోతాయి, అవసరమైతే కోర్టుకు వెళ్లి జైలుకు పంపిస్తాం. సైబర్ క్రైమ్ చేసే వాళ్లను వదిలి పెట్టమని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ నాయకులు ఈ రోజు మీ ఓట్లు తొలగిస్తారని, రేపు మీ ఆస్తులు కూడా కొట్టేస్తారని ఆయన ప్రజలకు సూచించారు.
Also Read : డేటా లీక్ చేయటానికి సిగ్గుండాలి, ఆంధ్రా పోలీసులకు తెలంగాణలో ఏం పని