Yadadri : యాదాద్రి క్షేత్రం మహాఅద్భుతం

యాదాద్రి క్షేత్రం మహాఅద్భుతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి తెలిపారు. దేశంలోనే...గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోందన్నారు.

Yadadri : యాదాద్రి క్షేత్రం మహాఅద్భుతం

Yadadri

Yadadri : యాదాద్రి క్షేత్రం మహాఅద్భుతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి తెలిపారు. దేశంలోనే…గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోందని, హైదరాబాద్ కు వచ్చిన ప్రతొక్కరూ…యాదాద్రి దర్శించుకోకుండా ఉండలేరని తెలిపారు. 2021, నవంబర్ 06వ తేదీ శనివారం ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Read More : T20 World Cup 2021 : కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికాదే విజయం.. అయినా ఇంటికే..

ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి..ఆయన ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా…మీడియాతో జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి మాట్లాడారు. దేశంలోనే యాదాద్రి ఆధ్మాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోందని, సాధ్యమైనంత త్వరగా…యాదాద్రి పనులను పూర్తి కావాలని ఆకాంక్షించారు. భక్తులందరికీ ఒకేరకమైన దర్శన భాగ్యం కలుగాలని, ప్రముఖులుతో పాటు..సాధారణ భక్తులకు సైతం…దర్శనం లభించేలా సౌకర్యాలు బాగున్నాయన్నారు. ఈ సందర్భగా…అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందచేశారు.