Laksha Kumkuma Archana : తిరుచానూరులో ఈనెల 29న పద్మావతి అమ్మవారికి ల‌క్ష‌ కుంకుమార్చ‌న

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల సందర్భంగా ఈనెల 29న లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నారు.

Laksha Kumkuma Archana : తిరుచానూరులో ఈనెల 29న పద్మావతి అమ్మవారికి ల‌క్ష‌ కుంకుమార్చ‌న

Laksha Kumkuma Archana

Laksha Kumkuma Archana  :  తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల సందర్భంగా ఈనెల 29న లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నారు. వ‌ర్చువ‌ల్‌ విధానంలో జ‌రిగే ల‌క్ష‌కుంకుమార్చ‌న సేవ కోసం భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవనచ్చని టీటీడీ తెలిపింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

ల‌క్ష‌కుంకుమార్చ‌న సేవా టికెట్ ధ‌ర‌ను రూ.1,116/-గా టిటిడి నిర్ణ‌యించింది. ఈ టికెట్ బుక్ చేసుకున్న గృహ‌స్తులు 90 రోజుల్లోపు రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ‌ద‌ర్శ‌న క్యూలైన్‌లో ఉచితంగా అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శన‌ స‌మ‌యంలో గృహ‌స్తుల‌కు ఉత్త‌రీయం, ర‌విక‌, అక్షింత‌లు అందిస్తారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు.

Also Read : Koil Alwar Thirumanjanam : తిరుమలలో న‌వంబ‌రు 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం