TTD : తిరుమలలో ‘సంప్రదాయ భోజనం’, గో ఆధారిత భోజనం ఇలా

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో సంప్రదాయ భోజనం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 2021, ఆగస్టు 26వ తేదీ గురువారం అన్నమయ్య భవన్ లో కొందరికి సంప్రదాయ భోజనం అందించారు.

TTD : తిరుమలలో ‘సంప్రదాయ భోజనం’, గో ఆధారిత భోజనం ఇలా

Ttd Bhojanam

‘Sampradaya Bhojanam’ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో సంప్రదాయ భోజనం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 2021, ఆగస్టు 26వ తేదీ గురువారం అన్నమయ్య భవన్ లో కొందరికి సంప్రదాయ భోజనం అందించారు. మరో 15 నుంచి 20 రోజుల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీటీడీ అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి భక్తులకు ఉచిత భోజన సదుపాయంతో పాటు..సంప్రదాయ భోజనం అందించాలని టీటీడీ ఇటీవలే నిర్ణయించిన సంగతి తెలిసిందే. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాలతో భోజనం తయారు చేయనున్నారు.

ఇప్పటికే శ్రీవారికి నైవేద్యం ఈ విధంగానే సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. బియ్యం, పప్పు దినుసులతో తయారు చేసిన అల్పాహారం, భోజనం లాభాపేక్ష లేకుండా..వాటి తయారీకి అయ్యే ఖర్చుకు సమానమైన ధరకే భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన టీటీడీ..భక్తుల అభిప్రాయాలు, సూచనలు తీసుకొనేందుకు సెప్టెంబర్ 08 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

గో ఆధారిత భోజనం ఇలా…

దేశీయ ఆవుల ఎరువుతో పండించిన పంటలతో వీటిని తయారు చేశారు.  కులంకార్ బియ్యంతో ఇడ్లీలు, కాలాబాత్ బియ్యంతో ఉప్మా తయారు చేశారు. వీటిని తినడం వల్ల వ్యాధి నిరోధకతో పాటు…సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు. అన్నం, కొబ్బరి అన్నం, పులిహోరా, బోండా, ఉప్మా, ఇడ్లీ, పప్పు, సాంబారు, రసం, పూర్ణాలు, పచ్చడి, పెరుగు, నెయ్యి..మొత్తం..14 రకాల ఆహార పదార్థాలను వడ్డించారు.