IND vs SL : శ్రీలంక చిత్తు.. భారత్ ఘన విజయం

బౌలర్లు రాణించడంతో భారత్ మరో విజయాన్ని సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది

IND vs SL : శ్రీలంక చిత్తు.. భారత్ ఘన విజయం

IND vs SL

India vs Sri Lanka : బౌలర్లు రాణించడంతో భారత్ మరో విజయాన్ని సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంక బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే (42 నాటౌట్; 46 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్) ధనంజయ డిసిల్వా (41; 66 బంతుల్లో 5ఫోర్లు) పోరాడాడు. మిగిలిన వారిలో పాతుమ్ నిస్సంక(6), కుశాల్ మెండీస్ (15), దిముత్ కరుణరత్నే (2), ధసున్ శనక (9) లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా బుమ్రా, జడేజా చెరో రెండు సిరాజ్, హర్ధిక్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకంతో రాణించగా కేఎల్ రాహుల్ (39), ఇషాన్ కిషన్ (33)లు ఫర్వాలేదనిపించారు. విరాట్ కోహ్లీ(3), శుభమన్ గిల్ (19), హార్దిక్ పాండ్య (5), రవీంద్ర జడేజా (4)లు విఫలం అయ్యారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లతో భారత పతనాన్ని శాసించగా చరిత అసలంక నాలుగు, మహేశ్ తీక్షణ ఓ వికెట్ తీశారు.

Dunith Wellalage : ఎవరీ దునిత్ వెల్లలాగే..? భారత బ్యాటర్లకు చుక్కలు చూపిన 20 ఏళ్ల కుర్రాడు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ మొదటి వికెట్ 80 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. ఓ వైపు గిల్ లంక బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బందులు పడగా మరో వైపు రోహిత్ శర్మ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో భారత్ 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది.

దునిత్ వెల్లలాగే పాంచ్ పటాకా..

ఈ దశలో టీమ్ఇండియా భారీ స్కోరు చేస్తుందని అనిపించింది. అయితే.. బంతిని అందుకున్న 20 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే మొదటి బంతికే షాకిచ్చాడు. శుభమన్ గిల్ ను ఔట్ చేశాడు. ఆ తరువాత తన వరుస ఓవర్లలో విరాట్ కోహ్లీ, 44 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఊపు మీదున్న రోహిత్ శర్మను సైతం పెవిలియన్ కు చేర్చాడు. దీంతో ఓ దశలో 80/0 ఉన్న పటిష్ట స్థితిలో ఉన్న జట్టు కాస్త 91/3 తో కష్టాల్లో పడింది.

అయితే.. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ తో కలిసి కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న కేఎల్ రాహుల్ ను వెల్లలాగే ఔట్ చేయడంతో మరోసారి వికెట్ల పతనం మొదలైంది. చరిత్ అసలంక ఇషాన్ ను పెవిలియన్ కు పంపగా హార్దిక్ ఔట్ చేసి వెల్లలాగే ఐదు వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత అసలంక విజృంభించడంతో భారత్ వేగంగా వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో అక్షర్ పటేల్ (26 36బంతుల్లో 1సిక్స్) రాణించడంతో భారత స్కోరు 200 దాటింది. భారత జట్టు మొత్తం వికెట్లు స్పిన్నర్లే తీయడం గమనార్హం.

Rohit Sharma : రోహిత్ శర్మ అరుదైన ఘనత..