తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా…ఒక్కరోజే 499 కేసులు..ముగ్గురు మృతి

  • Published By: bheemraj ,Published On : June 19, 2020 / 06:45 PM IST
తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా…ఒక్కరోజే 499 కేసులు..ముగ్గురు మృతి

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గురువారం( జూన్ 19, 2020) ఒక్కరోజే 499 కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్ ఎంసీ పరిధిలోనే 329 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో కొత్తగా 129 కేసులు నమోదు అయ్యాయి. 
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 6,526 కు చేరింది.
 
గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 198కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గురువారం మొత్తం 2.477 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1,978 మందికి నెగెటివ్ గా నిర్ధారణ అయింది. 

ఇప్పటివరకు రాష్ట్రంలో 50, 569 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 51 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3,352 కి పెరిగింది. రాష్ట్రంలో 2,976 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.

జీహెచ్ ఎంసీ 329, రంగారెడ్డి 129, జనగామ 7, మహబూబ్ నగర్ 6, మేడ్చల్ 4, మంచిర్యాల 4, వరంగల్ అర్బన్ 4, నల్గొండ 4, నిజామాబాద్ 4, ఖమ్మం 2, సూర్యపేట 2, సంగారెడ్డి 1, జగిత్యాల 1, కరీంనగర్ 1, యాదాద్రి భువనగిరి 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.