Prajasangrama Yatra High Court : హైకోర్టులో ప్రజాసంగ్రామ యాత్ర పంచాయితీ..యాత్ర కొనసాగుతుందా? సభకు అనుమతి లభిస్తుందా?

ప్రజాసంగ్రామ యాత్ర పంచాయితీపై మరికాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రజాసంగ్రామ యాత్రకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాని కోరుతూ పోలీసులు సీజే బెంచ్‌ను ఆశ్రయించారు. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగితే లా అండ్ ఆర్డర్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉందని పాదయాత్రను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు.

Prajasangrama Yatra High Court : హైకోర్టులో ప్రజాసంగ్రామ యాత్ర పంచాయితీ..యాత్ర కొనసాగుతుందా? సభకు అనుమతి లభిస్తుందా?

Prajasangrama Yatra High Court

Prajasangrama Yatra High Court : ప్రజాసంగ్రామ యాత్ర పంచాయితీపై మరికాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రజాసంగ్రామ యాత్రకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాని కోరుతూ పోలీసులు సీజే బెంచ్‌ను ఆశ్రయించారు. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగితే లా అండ్ ఆర్డర్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉందని పాదయాత్రను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు.

మరోవైపు పాదయాత్ర ముగింపు సభకు అనుమతి ఇవ్వాలంటూ బండి సంజయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై మరికాసేపట్లో హైకోర్టు విచారణ చేపట్టనుంది. రెండు లంచ్‌ పిటిషన్లపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరుగనుంది. యాత్ర కొనసాగుతుందా? సభకు అనుమతి లభిస్తుందా? అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. హైకోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Bandi Sanjay padayatra : యువకుడిపై బీజేపీ కార్యకర్తల దాడి..బండి సంజయ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత..

మరోవైపు బీజేపీ సభకు అనుమతివ్వకపోవడంపై బండి సంజయ్ మండిపడ్డారు. రేపటి సభను విఫలం చేస్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ కార్యకర్తలు ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకొని నిరసన తెలుపుతారన్నారు. దమ్ముంటే సభను ఆపుకోండంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.