Dead Body : మూసీ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహం

హిమాయత్ సాగర్ 10 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో మూసీకి వరద ఉదృతి పెరిగింది. కాచిగూడ కృష్ణానగర్ వెనుక వైపు వున్న మూసీ నదిలో మృతదేహం కొట్టుకొచ్చింది.

Dead Body : మూసీ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహం

Dead Body

Dead body in Musi River : గులాబ్ తుఫాన్ ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో శివారు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారడంతో అధికారులు 6 గేట్లు ఎత్తివేశారు. హిమాయత్ సాగర్ 10 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి..నీటిని దిగువకు విడుదల చేశారు.

దీంతో మూసీకి వరద ఉదృతి పెరిగింది. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలను అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు చోట్ల వాహనాలను దారి మళ్లించారు. మరోవైపు కాచీగూడ కృష్ణానగర్ వెనుక వైపు వున్న మూసీ నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది.

Musi River : ఎడతెరిపిలేని వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ నది

సాధారణ వర్షాలు పడితేనే నగరం నరకాన్ని తలపిస్తోంది. ఇక కుండపోత వాన ఎడతెరిపిలేకుండా కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టమవుతుంది. తాజాగా గులాబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షంతో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంటినుంచి కాలు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు.

మరోవైపు నగరంలో ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని హెచ్చరిక జారీ చేసింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Bank Customers : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

గతేడాది రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి నగరం సాగరమైంది. వీధులు నదులను తలపించాయి. నగరంలోని దారులు గోదారులయ్యాయి. కుండపోత.. గుండెకోతను మిగిల్చింది. నీట మునిగిన ఇళ్లు… బతుకమ్మలను తలపించాయి. మహానగరంలో ఎటు చూసినా ఇప్పటికీ ఇదే సీన్‌ కనిపిస్తోంది. ఆనాటి భయం హైదరాబాద్ వాసులను ఇంకా వెంటాడుతోంది.

ప్రస్తుతం దంచికొడుతున్న వానలు, వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. దీంతో చినుకు పడితే చాలు నగర ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. మరోసారి అదే పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు. మరోవైపు గతేడాది అనుభవాలతోనూ గుణపాఠం నేర్వని జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు… వారిని మరింత ఆందోళన కల్గిస్తోంది.