Revanth Reddy: ఇసుక మాఫియాలో కేసీఆర్ కుటుంబ భాగస్వామ్యం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణ

మానేరు వాగులో క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకే లారీ పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుక తరలిస్తున్నారు. ఇసుక దోపిడీని ప్రజలకు చూపించడానికే ఇక్కడకు వచ్చాను. అక్రమ ఇసుక తరలించి కోట్లు కూడబెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలు వాడి అక్రమ ఇసుక తరలిస్తున్నారు.

Revanth Reddy: ఇసుక మాఫియాలో కేసీఆర్ కుటుంబ భాగస్వామ్యం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణ

Revanth Reddy: మానేరు వాగులో క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, ఇసుక మాఫియాలో సీఎం కేసీఆర్ కుటుంబానికి భాగస్వామ్యం ఉందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కరీంగనర్ జిల్లా, జమ్మికుంట మండలంలోని తనుగుల ఇసుక క్వారీని బుధవారం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

BRS Party: బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రెటరీగా తివారీ.. మహారాష్ట్ర డివిజన్ కో-ఆర్డినేటర్లను ప్రకటించిన కేసీఆర్

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇసుక మాఫియా తీరుపై విమర్శలు చేశారు. ‘‘మానేరు వాగులో క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకే లారీ పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుక తరలిస్తున్నారు. ఇసుక దోపిడీని ప్రజలకు చూపించడానికే ఇక్కడకు వచ్చాను. అక్రమ ఇసుక తరలించి కోట్లు కూడబెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలు వాడి అక్రమ ఇసుక తరలిస్తున్నారు. అధికారులను అడుగుదామంటే ఒక్క అధికారి కూడా అందుబాటులో లేడు. ఇక్కడ మొత్తం ప్రైవేట్ సామ్రాజ్యంగా మారి అక్రమ ఇసుక తరలిస్తున్నారు. అక్రమ ఇసుకపై ఫిర్యాదులు చేసిన వారిని ఇబ్బందులకు గురి చేసి దాడులకు పాల్పడుతున్నారు.

Telangana : యూపీ తరహాలోనే బుల్డోజర్లతో వారి ఇళ్లు కూల్చేస్తాం : బండి సంజయ్

మానేర్ వాగులో ఈ రకంగా ఇసుక తీస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ఎడారిగా మారే అవకాశం ఉంది. ఇసుక మాఫియాలో కేసీఆర్ కుటుంబం భాగస్వామ్యం ఉంది. కాబట్టే ఇంత అక్రమం గా ఇసుక తరలిస్తున్నారు. ఈ మాఫియాకు కేసీఆర్ కుటుంబానికి చెందిన జోగినపల్లి సంతోష్, జోగినపల్లి రవీందర్ రావు భాగస్వామ్యం ఉంది. అక్రమంగా ఇసుక తరలిస్తుంటే స్థానిక శాసన సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు ఏం చేస్తున్నారు. ఎమ్మేల్యే, ఎంపీ ఎందుకు మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇసుక దోపిడీని ప్రజలకు చూపించి, కోర్టుకు వెళ్లి అక్రమ క్వారీలను మూసేసే వరకు పోరాటం కొనసాగిస్తుంది.

అక్రమ గ్రానైట్ ఇసుక మైనింగ్ వ్యాపారం కేసీఆర్ కుటుంబానికి అదాయ వనరుగా మారింది. ఇసుక మాఫియా వల్లనే కాళేశ్వరం కొట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర కొత్త కాదు. మా పాదయాత్ర వల్ల కేసీఆర్ కుర్చీ కదులుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పై బీఆర్ఎస్ పార్టీ దాడులు చేస్తోంది. దాడులు చేసి సమస్యను పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ దాడులకు భయపడదు. తప్పకుండా ప్రజా సమస్యల పై పోరాడుతుంది’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.