Hyderabad Metro Rail : మెట్రో రైలు సమయాలు పెంపు-రేపటి నుంచి అమల్లోకి

రాష్ట్రంలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయటంతో హైదారాబాద్ నగరంలో మెట్రో రైలు సర్వీసుల సేవలను అధికారులు పూర్తి స్ధాయిలో అందుబాటులోకి తెస్తున్నారు.

Hyderabad Metro Rail : మెట్రో రైలు సమయాలు పెంపు-రేపటి నుంచి అమల్లోకి

Hyderabad Metro Rail

Hyderabad Metro Rail : రాష్ట్రంలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయటంతో హైదారాబాద్ నగరంలో మెట్రో రైలు సర్వీసుల సేవలను అధికారులు పూర్తి స్ధాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. సోమవారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వీసులు నడపనున్నారు.

మొదటి రైలు ఉదయం 7 గంటలకు బయలు దేరుతుంది. ఆఖరి స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు రైలు బయలు దేరి 10 గంటలకు నాగోలు చేరుకుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో లో ప్రయాణించే వారు తప్పని సరిగా మాస్క్ లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ,శానిటైజర్ ఉపయోగించాలని మెట్రో అధికారులు కోరారు.