మున్సిపల్ ఫలితాలు : ఎంఐఎం బోణీ.. హోరాహోరీ పోరులో బీజేపీపై గెలుపు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో

  • Published By: veegamteam ,Published On : January 25, 2020 / 07:31 AM IST
మున్సిపల్ ఫలితాలు : ఎంఐఎం బోణీ.. హోరాహోరీ పోరులో బీజేపీపై గెలుపు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో బీజేపీ-ఎంఐఎం మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చివరికి ఎంఐఎం విజయం సాధించింది. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. ఎంఐఎం-15, బీజేపీ-9, ఇతరులు-2 వార్డుల్లో గెలిచారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ జోరు కనిపించింది. అయితే భైంసాలో మాత్రం టీఆర్ఎస్ హవా కనిపించలేదు. ప్రధాన పోరు బీజేపీ-ఎంఐఎం మధ్య నడిచింది. బోణీ కొట్టడంతో ఎంఐఎం నేతల్లో ఆనందం నెలకొంది.

శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి వార్డుకు రెండు టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. మొద‌ట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను పార్టీల వారిగా విభ‌జించి బండిల్‌గా కట్టి.. లెక్కిస్తున్నారు.
 
120 మున్సిపాలిటీలు.. 9 కార్పొరేషన్లలో 12వేల 926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి కూడా టీఆర్ఎస్ జోరు స్పష్టంగా కనిపించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తొలి బోణీ కొట్టింది టీఆర్ఎస్సే. తొలుత పరకాల, చెన్నూరు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చెన్నూరులో మొత్తం 18 వార్డులను దక్కించుకుంది. పరకాలలో మొత్తం 22 వార్డులు కైవసం చేసుకుంది.

మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు చూపింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఫలితాల్లో కారు హవా కనిపించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో మెజార్టీ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను టీఆర్ఎస్ గెలుచుకుంది. ఈ ఫలితాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి. నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంచి హంగామా చేశారు. తెలంగాణ భవన్ దగ్గర కోలాహలం నెలకొంది. మున్సిపల్ ఫలితాలు టీఆర్ఎస్ పాలనకు అద్దం పట్టాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ప్రజలు టీఆర్ఎస్ పై నమ్మకం ఉంచారు అని చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు.

Also Read : ఇదేనా వైసీపీ వ్యూహం: లోకేశ్‌కు తప్పదా రాజకీయ నిరుద్యోగం?