Parliament : ధాన్యం దంగల్, సీఎం ద్వారా నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు

అవసరం లేకుండా బియ్యం తీసుకుని ఏం చేయాలని, లేనిపక్షంలో మీ రాష్ట్రాల్లోనే బియ్యాన్ని పంపిణీ చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ విషయంలో...

Parliament : ధాన్యం దంగల్, సీఎం ద్వారా నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు

Paddy

Telangana State Paddy Issue : తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం పంచాయితీ ఇంకా కంటిన్యూ అవుతోంది. కేంద్రం, రాష్ట్ర నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని ఇటీవలే ఢిల్లీకి వచ్చిన మంత్రులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన సంగతి తెలిసిందే. కానీ.. ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. తాజాగా.. పార్లమెంట్ సాక్షిగా మంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పరోక్ష ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఆయన చేసిన ఆరోపణలు చర్చనీయాంశమౌతున్నాయి. సీఎం కేసీఆర్ ద్వారా తనను బెదిరించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు.

Read More : Paddy Procurement Row : తెలంగాణ.. భారత్‌లో భాగం కాదా? ఎందుకీ వివక్ష..? కేంద్రంపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం

పారా బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాతపూర్వకంగా ఇచ్చారని, MOU ప్రకారమే ముడిబియ్యం ఇస్తామని అందులో రాసిచ్చారని వెల్లడించారు. ఇప్పుడు కొత్తగా వడ్ల సేకరణ అంశాన్ని తీసుకొచ్చారంటూ ఫైర్ అయ్యారు. పంజాబ్ తరహాలో కొనాలని సీఎం కేసీఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో పండే బియ్యాన్ని దేశమంతటా తింటారని, అలాంటి ముడి బియ్యాన్ని ఇవ్వాలని తాము కోరడం జరిగిందన్నారు. ధాన్యం విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టిస్తోందని విమర్శలు గుప్పించారు. ఆ రాష్ట్రంలో పండే రా రైస్ మొత్తం తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు.

Read More : Paddy Issue : పీయూష్ గోయల్‌‌కు మంత్రి ఎర్రబెల్లి సవాల్

అయితే.. మిగులు బియ్యం ముడిబియ్యం అయితేనే తీసుకుంటామని తెలిపారు. మిగులు ధాన్యాన్ని, ముడి బియ్యమే తీసుకోవడం జరుగుతుందని, అవసరం లేకుండా బియ్యం తీసుకుని ఏం చేయాలని, లేనిపక్షంలో మీ రాష్ట్రాల్లోనే బియ్యాన్ని పంపిణీ చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్రాలకు 90 శాతం డబ్బు అడ్వాన్స్ గా పంపుతున్నట్లు, ఏవైనా రాష్ట్రాలపై ఫిర్యాదులుంటే బృందాలను పంపి తనిఖీలు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఫిర్యాదులు వచ్చాయి.. అక్కడి రైస్ మిల్లులను పరిశీలించామన్నారు. పీయూష్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అయోమయం సృష్టిస్తోందని, ఎంవోయూలో, రాజ్యాంగంలో ధాన్యాన్ని కొనాలని రాసి ఉందన్నారు. ఎక్కడా ముడి బియ్యాన్ని మాత్రమే కొంటామని రాసి లేదని స్పష్టం చేశారు.