Komaram bheem District: నిండు గర్భిణీకి కూల్డ్రింక్లో విషం కలిపి ఇచ్చిన అత్తామామలు
నిండు గర్భిణీకి కూల్డ్రింక్లో విషం కలిపి ఇచ్చారు అత్తామామలు. తనపై ఎంతో ప్రేమతో వారు కూల్డ్రింక్ ఇచ్చారని అనుకుని తాగిన ఆ కోడలు రక్తపు వాంతులు చేసుకుంది. దీంతో ఆ గర్భిణీని ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు వెంటనే డెలివరీ చేశారు. అయితే, విష ప్రభావంతో శిశువు ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయింది.
Komaram bheem District: నిండు గర్భిణీకి కూల్డ్రింక్లో విషం కలిపి ఇచ్చారు అత్తామామలు. తనపై ఎంతో ప్రేమతో వారు కూల్డ్రింక్ ఇచ్చారని అనుకుని తాగిన ఆ కోడలు రక్తపు వాంతులు చేసుకుంది. దీంతో ఆ గర్భిణీని ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు వెంటనే డెలివరీ చేశారు. అయితే, విష ప్రభావంతో శిశువు ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయింది.
బాధిత మహిళకు ఆడ శిశువు పుట్టిందని, విషయం కలిపిన కూల్ డ్రింక్ ను తల్లి తాగడంతో పాప మృతి చెందిందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కుమ్రం భీం జిల్లా కేశపట్నంలో చోటుచేసుకుంది.
ఈ దారుణ ఘటనపై సిర్ఫూర్.టి సీఐ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. ఆమెపై హత్యాయత్నం చేసి అత్తామామలను అరెస్టు చేశామని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.