Attack On TRS MLA : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడి
ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడికి దిగారు కొంతమంది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారుపై గుడ్లతో దాడికి పాల్పడ్డారు ఎన్ఎస్ యూఐ సభ్యులు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడికి దిగారు కొంతమంది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారుపై గుడ్లతో దాడికి పాల్పడ్డారు ఎన్ఎస్ యూఐ సభ్యులు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు ఎన్ఎస్ యూఐ సభ్యులు. ఆయన కారుపై కోడిగుడ్లు కొట్టారు.
ఎన్ఎస్ యూఐ సభ్యులు చర్యతో ఆగ్రహించిన మంచిరెడ్డి అనుచరులు..గన్ వెమన్ వెంటనే కారు దిగి మరీ వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని పట్టుకుని చితక్కొట్టినట్లుగా తెలుస్తోంది. మా నాయకుడి వాహనాన్నే అడ్డుకుంటారా? దాడులు చేస్తారా? అంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో సాగర్ హైవేపై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడికి సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి.
మూడు రోజుల క్రితం ఎన్ఎస్ యూఐ నేతలు ఎమ్మెల్యే కాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అప్పుడు కూడా ఉద్రిక్తత ఏర్పడింది. అప్పుడు కూడా కాంగ్రెస్ శ్రేణులపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. వెంబడించి మరీ కొట్టారు.