Maoist: కరోనా చికిత్సకు వచ్చి పోలీసులకు చిక్కిన మావోయిస్టులు.

కరోనా భారిన పడ్డ మావోయిస్టులు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తుండగా పోలీసులకు చిక్కారు. మంగళవారం వరంగల్ జిల్లా మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.

Maoist: కరోనా చికిత్సకు వచ్చి పోలీసులకు చిక్కిన మావోయిస్టులు.

Maoist

Maoist: కరోనా భారిన పడ్డ మావోయిస్టులు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తుండగా పోలీసులకు చిక్కారు. మంగళవారం వరంగల్ జిల్లా మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఓ కారులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపి ప్రశ్నించారు. దీంతో వారు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన దండకారణ్య స్పెషల్ జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్, కొరియర్ బందుగ వినయ్‌గా పోలీసులు గుర్తించారు.

అనంతరం వీరిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. మొత్తం 12 మంది కరోనా బారినపడినట్లు మావోయిస్టులు వెల్లడించారు. మావోయిస్టుల అరెస్టుకు సంబందించిన వివరాలను వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి వెల్లడించారు. కరోనా సోకిన వారందరూ బయటకు వస్తే తాము మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కరోనా బారినపడిన 12 మంది పేర్లను వెల్లడించారు కమిషనర్ తరుణ్ జోషి

బడే చొక్కారావు అలియాస్ దామోదర్
కటకం రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న
కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్స్
కున్‌కటి వెంకటయ్య అలియాస్ వికాస్
ముచ్చకి ఉజల్ అలియాస్ రఘు
కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్
తిప్పరి తిరుతి అలియాస్ దేవుజీ
యాప నారాయణ అలియాస్ హరిభూషణ్
ములా దేవేంద్రరెడ్డి అలియాస్ మాస దడ
కొడి మంజుల అలియాస్ నిర్మల
పూసం పద్మ
కాకర్ల సునీత అలియాస్ బుర్రా.

ఇక వీరికి కరోనా సోకడానికి తాజాగా చేపట్టిన నిరసన కార్యక్రమమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. బీజాపూర్ సిల్దూర్ గ్రామం వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపును వ్యతిరేకిస్తూ ఛత్తీస్ ఘడ్.. తెలంగాణ సరిహద్దులోని ప్రజలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారానే మావోయిస్టులకు కరోనా సోకినట్లుగా భావిస్తున్నారు పోలీసులు.